వరంగల్

రాజీవ్ ఆశయ సాధనకు కాంగ్రెస్ కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేయు క్యాంపస్, మే 21: హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో భారత ప్రధాని రాజీవ్‌గాందీ 27వ వర్దంతి నిర్వహించారు. కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు రాజీవ్‌గాందీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు నాయినిరాజేందర్ రెడ్డి మాట్లాడుతూ 40సంవత్సరాల వయసులోనే ప్రధానమంత్రి పదవినీ చేపట్టి అతి పిన్నవయస్కుడు రాజీవ్‌గాందీ అని కొనియాడారు.దేశ అభ్యున్నతికోసం నిరంతరం తపించిన మహానాయకుడు అని అన్నారు. మహిళలకు 23శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చారని, దేశంలో18సంవత్సరాలకే వయోజన ఓటు హక్కు కల్పించారని అన్నారు. రాజీవ్‌గాంధీ ఆశయ సాధనకు కాంగ్రెస్‌పార్టీ కృషి చేస్తుందని అన్నారు, ఈ కార్యక్రమంలో గ్రేటర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్‌రావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్సి నమిండ్ల శ్రీనివాస్,మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ,మాజీ కార్పోరేటర్లు రమణారెడ్డి, హన్మకొండ బ్లాక్‌కాంగ్రేస్ అధ్యక్షుడు నాయిని లక్ష్మారెడ్డి బంకసంపత్‌యాదవ్ మైనార్టీ సెల్ చైర్మన్ మహ్మద్ ఆయూబ్ జిల్లా మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు నునావత్ రాధ తదితర నాయకులు పాల్గొన్నారు..
నల్లబెలిలో..
నల్లబెల్లి: మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్‌గాందీ 27వ వర్థంతి వేడుకలను నల్లబెల్లి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. నల్లబెల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి రాజీవ్‌గాందీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళీలు అర్పీంచారు. ఈ కార్యక్రమంలో ఎరుకల రవింధర్, నాంపెల్లి వీరన్న, రఘుపతి, నూనె చిరంజీవి, చరణ్‌సింగ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
పరకాలలో..
పరకాల: సోమవారం పరకాల పట్టణంలో పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పసుల రమేష్ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 27వ వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ సంతోష్, సేవాదళ్ జిల్లా ఆర్గనేజర్ చందర్, యువజన కాంగ్రెస్ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు రజని తదితరులు పాల్గొన్నారు.
మొగుళ్ళపల్లిలో..
మొగుళ్ళపల్లి: స్వర్గీయ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ 27వ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకున్నారు. మొగుళ్ళపల్లి చౌరస్తాలో రాజీవ్‌గాంధీ విగ్రహానికి ఆ పార్టీ మండల అధ్యక్షులు టి. రాజేశ్వర్‌రావు పూల మాల వేసి దేశానికి రాజీవ్‌గాంధీ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జొరుక సదయ్య, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ యార మల్లరెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సంసుందర్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
సంగెంలో..
సంగెం: మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవగాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం సంగెం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూల మాలాలు వేసి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సాంబయ్య, కృష్ణ, ప్రశాంత్, పులిసాంబయ్య తదితరులు పాల్గొన్నారు.