వరంగల్

మల్లూరుకు రండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగపేట, ఏప్రిల్ 30: మే 20 నుండి 26 వరకు జరగనున్న శ్రీహేమాచల (మల్లూరు) లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు సంబందించిన గోడ పత్రికను రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందులాల్ శనివారం ములుగులో ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాలకు మల్లూరు రావాల్సిందిగా ఈ సందర్బంగా ఆలయ మేనేజర్ ఉడతనేని రామారావు మంత్రి చందులాల్‌ను ఆహ్వానించారు. మల్లూరు లక్ష్మీ నరసింహుని నాభిప్రసాదాన్ని ఈ సందర్బంగా మంత్రి చందులాల్‌కు ఆలయ అర్చకులు అందచేశారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ ఉడతనేని రామారావు, అర్చకులు ఏదునూతల ఈశ్వర చంద్ శర్మ, టిఆర్‌ఎస్ ములగు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్ పాల్గొన్నారు.