వరంగల్

యువత చూపు బీజేపి వైపే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేగొండ, అక్టోబర్ 21: ప్రధాన నరేంద్రమోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి యువత బీజేపి వైపు అడుగులు వేస్తున్నారని బీజేపి భూపాలపల్లి నియోజకవర్గ అభ్యర్ధి చందుపట్ల కీర్తిరెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం మండలంలోని కోడవటాంచ లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో బీజేపి ప్రచార రథానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండలంలోని రజక్కపల్లి గ్రామానికి చెందిన 50 మంది యువకులు బీజేపి పార్టీలో చేరారు. వారికి కీర్తిరెడ్డి పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాపై నమ్మకంతో భూపాలపల్లి టికెట్ ఇచ్చిన బీజేపి అధిష్టానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి భూపాలపల్లిని కానుకగా ఇస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకుంటుందని ఆరోపించారు. అవినీతి అక్రమాలకు అడ్రస్ కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్, టీ ఆర్ ఎస్ రెండు అవినీతి పార్టీలే అని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపితోనే సాధ్యమని అన్నారు. భూపాలపల్లిలో స్పీకర్ చేసిన అభివృద్ధి ఏం లేదన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు ఎక్కడ జరిగాయో చూపాలని ఆమె ప్రశ్నించారు. తెరాస ప్రభుత్వంది కేవలం కుటుంబ పాలనే తప్పా మరోకటి లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎండ్ల అశోక్ రెడ్డి, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జయపాల్, బీజేపి నాయకులు చందుపట్ల సత్యపల్, వెన్నంపల్లి రాజు, శ్రీ్ధర్, గణేష్ పాల్గొన్నారు.