వరంగల్

సీఎం టూర్ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి/మహదేవ్‌పూర్, డిసెంబర్ 17: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల పర్యటన రద్దు అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా మహదేవ్‌పూర్ మం డలంలో నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజి, కనె్నపల్లి పంప్ హౌస్, అన్నారం బ్యారేజ్‌లను సందర్శించే నేపథ్యంలో పెథాయ్ తుఫాన్ ప్రభావంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన రద్దు అయినట్లు జిల్లా అధికారులు తెలిపారు. తుఫాన్ కారణంగా జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం పర్యటన రద్దు చేశారు.

20న కేటీఆర్ రాక
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వరంగల్‌లో తొలి పర్యటన
ఘన స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు
వేలాది సంఖ్యలో బైక్‌ర్యాలీ, కార్యకర్తల సమావేశాలు
కడియం నేతృత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల, చైర్మన్ల సమావేశం

వరంగల్, డిసెంబర్ 17: టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేటీఆర్ తొలిసారిగా ఈ నెల 20వ తేదిన వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాల్లో పర్యటించి కార్యకర్తల సమావేశంలో పార్టీ పటిష్టత, రాబోయో పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసే విధంగా పార్టీ శ్రేణులకు ఆయన దిశా నిర్ధేశం చేయనున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతల స్వీకరించిన ఆయన మొదటిసారిగా వరంగల్ జిల్లాకు వస్తున్న కేటీఆర్‌కు ఘన స్వా గతం పలికేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు సిద్దమయ్యారు. ఈ మేరకు హైదరాబాద్ టూరిజం ప్లాజా లో సోమవారం కడియం శ్రీహరి నేతృత్వంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తాటికొండ రాజయ్య, దాస్యం వినయ్‌భాస్కర్, ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, రైతు గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్ధ చైర్మన్ రాజయ్య యాదవ్ సమావేశమయ్యారు. ఈ నెల 20వ తేదిన ఉదయం 11గంటలకు జనగామ జిల్లాలోని ప్రిస్టన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసి పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్, జనగామ నియోజకవర్గాల ఉమ్మడి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. జనగామ జిల్లా వస్తున్న నేపథ్యంలో పెంబర్తి కాకతీయ కళాతోరణం నుంచి ప్రిస్టన్ గ్రౌండ్స్ వరకు వేలాదిగా పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీతో కేటీఆర్‌కు ఘన స్వాగతం పలకాలని నిర్ణయించారు. మధ్యా హ్నం రెండు గంటలకు వరంగల్ జిల్లాకు వస్తున్న నేపధ్యంలో మడికొండ నుండి కూడా మైదానం వరకు వేల సంఖ్యలో పార్టీ కార్యకర్తల బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలకాలని సమావేశం నిర్ణయించింది. అనంతరం అర్బన్ టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి ఆయన శంఖుస్ధాపన చేయనున్నారు. ఆ తర్వాత కూడా మైదానంలో వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా పార్టీ కార్యకర్తలతో ఉమ్మడి సమావేశంలో ఆయన మాట్లాడి దిశానిర్ధేశం చేయనున్నారు. వరంగల్ అర్బన్, రూరల్, జనగామ జిల్లాల పరిధిలోని ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి రెండు చోట్ల నిర్వహించే కార్యర్తల సమావేశాలకు బూత్ కమిటి చైర్మన్లు, సభ్యులు, పార్టీ గ్రామ కమిటీ నాయకులు, గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్ధాయి రైతు సమన్వయ సమితి కో ఆర్టీనేటర్లు, సభ్యులు, మాజీ సర్పంచలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ బాధ్యులు, నేతలు పాల్గొని విజయవంతం చేయాలని కడియం కోరారు.

పంచాయతీ ఎన్నికల పూర్తి బాధ్యత
రిటర్నింగ్ అధికారులదే
* మహబూబాబాద్ కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య
మహబూబాబాద్, డిసెంబర్ 17: పంచాయతీ ఎన్నికల నిర్వహణ పూర్తి బాధ్యత రిటర్నింగ్ అధికారులపైనే ఉంటుందని జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అన్నారు. మహబూబాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం రెండవదశ రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. మొదటి విడుత రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమం ఇప్పటికే నిర్వహించామన్నారు. రెండవదశ రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నిర్వహణలో పూర్తిస్థాయి అవగాహన పెంచుకోవాలన్నారు. ఎన్నికల సంఘం నియమావళిని తూచా తప్పకుంటా పాటిస్తూ దానిప్రకారమే విధులు నిర్వహించాలని తెలిపారు. శిక్షణలో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. ఎమైనా సందేహాలు ఉంటే శిక్షణలోనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. నోటిఫికేషన్ నుండి నామినేషన్‌ల స్వీకరణ, పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ, ఉపసంహరణ, పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటించడం వంటి అన్ని కార్యక్రమాలు రిటర్నింగ్ అధికారులే నిర్వహించాల్సి ఉం టుందన్నారు. పోటీలో పాల్గొనే అభ్యర్థులు ఎన్నికల ఖర్చును కచ్చితంగా సమర్పించాలని తెలిపారు. గ్రామపంచాయతీలో పోలింగ్ స్టేషన్‌ల ఏర్పాటు, ఇతర అన్ని ఏర్పాట్లను పరిశీలించాలని, ఓటర్లకు ఫొటో ఓటర్ స్లిప్‌ను జారీచేయాలని అన్నారు. పోలింగ్ నిర్వహణకు ఎలాంటి అవాంతరాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఓట్లను లెక్కించిన తదుపరి ఫలితాలు ప్రకటించాలని సంబందిత ఎంపీడీవో సహాయంతో అధికారిక ఎన్నికల ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని తెలిపారు. ఎన్నికల ధృవపత్రాలను జారీచేయాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మండలస్థాయి ఎన్నికల అధికారికి వినియోగించిన, వినియోగించని బ్యాలెట్ పేపర్‌లతో కూడిన బ్యాలెట్ బాక్సులు, ఇతర స్టేషనరిలను అప్పగించాలని తెలిపారు. గత ఎన్నికల్లో ఎక్కువ మంది ఉద్యోగులే ఉన్నందున వారి అనుభవాలను జోడించి సమిష్టికృషితో ఎన్నికలను సజావుగా నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు రిటర్నింగ్ అధికారులు అడిగిన సందేహాలను కలెక్టర్ స్వయంగా నివృత్తి చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా పంచాయితీ అధికారి సూర్యనారాయణ, ఆర్డీవోలు కొంరయ్య, ఈశ్వరయ్యలతోపాటు రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.