వరంగల్

కేసముద్రం ముద్దు.. ఇనుగుర్తి మాకొద్దు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, డిసెంబర్ 18: ఇనుగుర్తిని మండలంగా ఏర్పాటు చేయాలని స్వయంగా సీఎం కేసీఆర్ ఆదివారం రాత్రి అధికారులకు ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ మండలంలో విలీన గ్రామాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సోమవారం కోర్కొండపల్లి వాసులు రాస్తారోకో నిర్వహించి తమను కేసముద్రంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. మంగళవారం కోర్కొండపల్లి బాటలో కోమటిపల్లి గ్రామస్తులు కలిసి.. తమ గ్రామాన్ని ఇనుగుర్తిలో విలీనం చేయవద్దని, కేసముద్రం మండలంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తొర్రూర్-కేసముద్రం ప్రధాన రహాదారిపై గంట పాటు రాస్తారోకో నిర్వహించా రు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం పేరుతో తమకు అసౌకర్యంగా ఉన్న ఇనుగుర్తిలో కలపడం ఏమిటన్నారు. గతంలో కూడా ఇలాగే అధికారులు గ్రామసభలు నిర్వహించగా, తాము ససేమిరా అన్నామని, ఆ మేరకు గ్రామసభ తీర్మాణం కూడా చేశామన్నారు. అయితే తాజాగా మళ్లీ ఇనుగుర్తిలో తమ గ్రామాన్ని విలీనం చేయడానికి అధికారులు నిర్ణయించినట్లు సమాచారం వచ్చిందన్నారు. తమ గ్రామాన్ని ఎట్టి పరిస్థితిలో ఇనుగుర్తిలో కలపకూడదని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చి అధికారులకు ఫిర్యాదు చేయాలని నచ్చజెప్పడంతో విరమించారు. కాగా కేసముద్రం మండల కేంద్రానికి సమీపంలో ఉన్న తమ గ్రామా న్ని ఇనుగుర్తిలో కలిపి ఇబ్బందుల పాలు చేయవద్దని కోరుతూ కోర్కొండపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు మంగళవారం మహబుబాబాద్ కలెక్టర్ శివలింగయ్యకు వినతి పత్రం సమర్పించారు.

కేయూకు ‘ఉత్తమ వాలెబుల్ స్టూడెంట్స్’
కేయూ క్యాంపస్, డిసెంబర్ 18: కాకతీయ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు ఈ నెల 10 నుండి 15 వరకు తమిళనాడులోని అలగప్ప విశ్వవిద్యాలయంలో నిర్వహించిన నేషనల్ ఇంటిగ్రేషన్ శిభిరంలో 10 మంది వాలంటీర్లు పాల్గొని మోస్ట్ వాలెబుల్ స్టూడెంట్స్‌గా ఎంపికైనారని ప్రోగ్రాం కో- ఆర్టీనేటర్ డాక్టర్ జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు.

ధ్యానంతో రోగాలు దరిచేరవు
సిద్ధేశ్వర పిరమిడ్ కేంద్రం ప్రారంభోత్సవంలో పత్రిజీ
బచ్చన్నపేట, డిసెంబర్ 18: శ్వాసమీద ద్యాస ఉంచి చేసే ధ్యానం మనిషిని సిద్దపురుషునిగా మరుస్తుందని జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ హితబోధ చేశారు. మంగళవారం కొడువటూరు సిద్దుల గుట్టపై దాతల విరాళాల రూ. 12లక్షల వ్యయంతో నిర్మించిన సిద్ధేశ్వర పిరమిడ్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించి, నిత్యాన్నదాన భవన నిర్మాణానికి శంఖుస్థాపచేశారు. 150 మంది ఒక్కేసారి ద్యానం చేయగల ఈ పిరమిడ్ కేంద్రంలో పలువురుతోకలిసి ముందుగా కాసేపు ద్యానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జంతువులను, పక్షులను చంపి తిననే హక్కును ఎవరు కల్పించారని ప్రశ్నించారు. ప్రాణంపోస్తే శక్తిలేన్నప్పుడు ప్రాణం తీసే హక్కు ఎక్కడిదన్నారు. ధాన్యం చేయడం వల్ల రోగాలు ధరిచేరవని, వైదులే అవసరంలేదని వివరించారు. నీటిలో మునితే స్నానం అంటారు. శ్వాసపై ద్యాస పెడితే ధ్యానం అంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో కొడువటూరు మాజీ సర్పంచ్ గంగం సతీష్‌రెడ్డి, మాజీ ఎంపిటిసి సభ్యులు రామయ్య, లక్ష్మినారయణ, పలు ప్రాంతాలనుంచి వచ్చిన పిరమిడ్ సభ్యులు పాల్గొన్నారు.

స్పీకర్‌పై కక్ష కట్టి ఓడించారు
* విశ్వ బ్రాహ్మణ రూరల్ జిల్లా అధ్యక్షుడు శంకరాచారి
శాయంపేట, డిసెంబర్ 18: భూపాలపల్లి నియోజకవర్గంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్పీకర్ మధుసూధనాచారిని ఉన్నత వర్గానికి చెందిన ముగ్గురు అభ్యర్ధులు కక్ష్య కట్టి ఓడించారని వరంగల్ రూరల్ జిల్లా విశ్వబ్రహ్మణ జిల్లా అధ్యక్షుడు వినుకొండ శంకరాచారి ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో విశ్వ బ్రహ్మణ సంఘం నుండి ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన ఎకైక వ్యక్తి సిరికొం డ మధుసూధనాచారి.. భూపాలపల్లి నియోజకవర్గంలో 3,500 కోట్లతో అభివృద్ధి పనులు చేశారని అటువంటి వ్యక్తి ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నామని అవేదన వ్యక్తం చేశారు. భూపాలపల్లిని జిల్లా చేయడంలో సిరికొండ పాత్ర కీలకం అని అన్నారు. ఇప్పుడు గెలిచిన గండ్ర వెంకటరమణరెడ్డి, ఇసుక మాఫియా, కల్తి పెట్రోల్ వంటి అక్రమాలతో వచ్చిన డబ్బును విచ్చల విడిగా ఖర్చు చేయడంతో పాటు మద్యం ఓటర్లకు, చీరల పంపిణీ చేశారని, మరో అభ్యర్ధి ఒక్క సారి జెడ్పీటీసీగా గెలిచి పనికి ఆహార బియ్యాన్ని పక్కదారి పట్టించి కోట్లు గట్టించారని అన్నారు. ఈ సమావేశంలో మండల విశ్వ బ్రహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి వినుకొండ రాజ్‌కుమార్, తెరాస నాయకుడు గదె రాజేందర్, ముంజల నాగరాజు, బాసాని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

పెథాయ్‌తో పలు రైళ్లు అలస్యం
కాజీపేట, డిసెంబర్ 18: పెథాయ్ తుఫానుతో కాజీపేట జంక్షన్ మీదుగా వెళ్లాల్సిన పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. సంబల్‌పూర్ నుం చి నాందేడ్ వెళ్లాల్సిన నాగవల్లి ఎక్స్‌ప్రెస్ నిర్ణీత సమయాని కన్నా మూడుగంటలు ఆలస్యంగా కాజీపేటకు చేరుకుంది. ముంబై భువనేశ్వర్ కోణా ర్క్ ఎక్స్‌ప్రెస్ గంటన్నర ఆలస్యంగా, హౌరా-హైదరాబాద్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ గంటన్నర, ఆదిలాబాద్-తిరుపతి క్రిష్ణా ఎక్స్‌ప్రెస్‌లు నిర్ణీత సమయాని కన్నా గంట సేపు ఆలస్యంగా చేరుకున్నాయి.సికింద్రాబాద్ నుంచి బలర్షా వెళ్లే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ నిర్ణీత సమయాని కన్నా 20నిమిషాల ఆలస్యంగా చేరుకుందని రైల్వే అధికారులు తెలిపారు.