వరంగల్

గొర్రెల యూనిట్‌తో ఆదాయం రెట్టింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 18: యాదవులు ఆదాయాన్ని జీవన ప్రమాణాలను పెం చుటకు జిల్లాలో ఇప్పటి వరకు 6144 గొర్రెల యూనిట్లను పంపిణీ చేసినట్లు వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో పశుసంవర్ధకశాఖ అధికారులు, పాల సేకరణ సంస్ధలతో నిర్వహించిన సమావేశంలో గొర్రెల యూనిట్లు, పాడి గేదెలు, పాడి ఆవుల పంపిణీ ప్రక్రియను సమీక్షించారు. 75శాంతం రాయితీతో 1.25 లక్షల విలువైన గొర్రెల యూనిట్‌తో కుటుంబాల ఆధాయాన్ని రెట్టింపు చేయాలని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేసి ఇచ్చిన గొర్రెలతో లబ్ధిచేకూర్చేందుకు నిరంతరం అందుబాటులో ఉండి సలహాలు, సూచనలు, వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మొదటి జాబితా ద్వారా 5,511 యూనిట్లు గ్రౌండింగ్ చేశామని తెలిపారు. రెండవ జాబితా ద్వారా 5,744 యూనిట్ల లక్ష్యానికి ఇప్పటి వరకు 663 యూనిట్లు గ్రౌండింగ్ చేసినట్లు తెలిపారు. మిగిలిన యూనిట్లను ఫిబ్రవరి నెలాఖరు వరకు గ్రౌండింగ్ చేసేందు కు నెలకు రెండు వేల యూనిట్లను కొనుగోలు చేయాలని తెలిపారు. అయితే వరంగల్ అర్బన్ జిల్లాకు కర్నూల్ జిల్లాలోని అర్బన్, సెమీ అర్బ న్ ప్రాంతాలుగావున్న మూడు మండలాలు కేటాయించినందున యూనిట్ల కొనుగోలులో ఇబ్బందిగా ఉన్నట్లు అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దానికి స్పందిస్తూ పశుసంవర్ధక శాఖ రాష్ట్ర సంచాలకులతో మాట్లాడి మొత్తం కర్నూల్ జిల్లా పరిధిలో యూనిట్ల కొనుగోలుకు వెసులుబాటు కల్పిస్తానని కలెక్టర్ హామి ఇచ్చారు. ఈ నెల 24 నుండి గొర్రెల యూనిట్లు పంపిణీ ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం నుండి మొదటి విడుతగా 10 కోట్లు నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. ప్రతి గొర్రెకు ఇన్స్‌రెన్సు తప్పనిసరి అని, ఇన్స్‌రెన్సు ప్రతిని లబ్ధిదారునికి ఇవ్వాలని స్పష్టం చేశారు. యూనిట్ల గ్రౌండింగ్‌పై ప్రత్యేక రిజిష్టర్ ఏర్పాటు చేయాలని తెలిపారు. లబ్ధిదారులు, అధికారుల సమస్యలను తెలుసుకుని స్పందించుటకు వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేయాలని తెలిపారు. మొదటి లిస్ట్‌లో చనిపోయిన 650 గొర్రెలకు ఇన్స్‌రెన్సు క్లైయిమ్ చేసినట్లు తెలిపారు. వాటిలో 399 గొర్రెలను ఇన్స్‌రెన్స్ మంజూరు అయినందున తిరిగి కొనుగోలు చేసి ఇచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పశువైద్యాధికారి పరంజ్యోతి, ఎడి శ్రీనివాస్, విజయ్‌డైరీ, డీడీ చంద్రశేఖర్, ముల్కనూర్ జియం భాస్కర్‌రెడ్డి, కరీంనగర్ డైరీ మేనేజర్ నర్సింహా పాల్గొన్నారు.

షీ టీమ్స్‌తో మహిళల్లో ఆత్మవిశ్వాసం
నేర రహిత నగరంగా వరంగల్‌ను తీర్చిదిద్దుతాం: షీ టీమ్స్ ఇన్‌చార్జి ఏసీపీ బాబురావు
నక్కలగుట్ట, డిసెంబర్ 18: నేర రహిత నగరంగా వరంగల్‌ను తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని, షీ టీమ్స్ మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచాయని, ఆకతాయి పనులు చేసి జీవితాలను నష్టపరుచుకోవద్దని షీ టీమ్స్ ఇన్‌చార్జి ఏసీపీ బాబురావు అన్నారు. వరంగల్ సీపీ రవీందర్ ఆదేశానుసారం వరంగల్ రైల్వేస్టేషన్, బస్‌స్టాండ్, హన్మకొండ ప్రైవేట్ హాస్టళ్లు, ఖాజీపేట ప్రాంతాలలో విద్యార్థినులు, మహిళలను వేధిస్తున్న 25 మంది ఆకతాయిలను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం షీ టీమ్స్ ఇన్సిపెక్టర్ శ్రీనివాసరావు అధ్వర్యంలో ఆకతాయిల తల్లిదండ్రుల సమక్షంలో నిర్వహించిన కౌన్సిలింగ్‌లో బాబురావు మాట్లాడు తూ విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనపుడు ధైర్యంగా భయపడకుండా వచ్చి షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేస్తే, నిందుతులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. మహిళలకు భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. అబ్బాయిలతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, ప్రతి విషయం తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు. షీ టీమ్స్ తెలియజేస్తే పరువుపోతుందని భావించరాదని తెలిపారు. మహిళా హాస్టళ్లలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా వారికి ఇబ్బంది కలిగిస్తే యాజమాన్యాలపైన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆటోలలో మహిళలు ప్రయాణం చేసే సమయంలో ఆటో డ్రైవర్లు అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిర్యాదు చేసే మహిళల ఐడెంటిటీ బయటకు రాకుండా చూస్తున్నామని, దీంతో ఫిర్యాదులు పెరుగుతున్నాయని, బాధితులకు న్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. మహిళలను వేధిస్తూ 3 సార్లు పట్టుబడితే వారిపై నిర్భయ ఆక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్స్ సిబ్బంది పాల్గొన్నారు.