వరంగల్

జనవరి 2 తర్వాత పంచాయతీ ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హంటర్‌రోడ్, డిసెంబర్ 18: జనవరి 2 తర్వాత ఎప్పుడైన గ్రామ పంచాయతీ ఎన్నిలకు నోటిఫికేషన్ వెలువడవచ్చునని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నాగిరెడ్డి వీడియో కాన్పరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. జనవరి 2 తరువాత ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానునట్లు ఆయన తెలిపారు. బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పేపర్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని సరిచూసుకోవాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ పంచాయితీ ఎన్నికల నిర్వహాణకు సర్వం సిద్దం చేసినట్లు ఆయన వివరించారు. జిల్లాలో 130 పంచాయతీలు ఉన్నాయని, ఐనవోలు మండలం, ఒంటిమామిడిపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం పదవీ కాలం 2020 వరకు ఉన్నందున 129 గ్రామ పంచాయితీలకు ఎన్నికల నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సంయుక్త కలెక్టర్ ఎస్ దయానంద్, జెడ్పీ సీఈవో విజయ్‌గోపాల్, డీపీవో యం ఏ మహమూద్ తదితరులు పాల్గొన్నారు.

రేపు వరంగల్‌కు కేటీఆర్ రాక
టీఆర్‌ఎస్ అర్బన్ కార్యాలయానికి శంకుస్థాపన * భారీగా స్వాగత ఏర్పాట్లు..

వరంగల్, డిసెంబర్ 18: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతల చేపట్టిన కేటీఆర్ మొదటి సారిగా వరంగల్ జిల్లా పర్యటనను ఎంచుకున్నారు. ఉద్యమ జిల్లా కావడంతో కేటీఆర్ ప్రధానంగా వరంగల్ జిల్లాకు రావాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు జనగామ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా బాల సముద్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. అనంతరం వరంగల్ కేడీసీ కళాశాల గ్రౌండ్‌లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఈ మేరకు కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను మంగళవారం కడియం శ్రీహరి పర్యవేక్షించారు. ముందుగా జనగామ జిల్లా పెంబర్తి కాకతీయ కళా తోరణం వద్ద కేటీఆర్ ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. అక్కడి నుండి జనగామ ప్రిస్టన్ గ్రౌండ్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశం ఉం టుంది. ఆ తర్వాత వరంగల్ అర్బన్ పార్టీ కార్యాలయానికి శంఖుస్ధాపన చేసి అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ కేసీఆర్ రెండవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజల అభివృద్ధి, సంక్షేమంపై పూర్తి స్ధాయిలో దృష్టి పెట్టాల్సి ఉన్నందున పార్టీని పటిష్టం చేసి రానున్న పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుబాటలో తీసుకెళ్లాడానికి సమర్ధుడైన కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగించడం వల్ల పార్టీ మరింత పటిష్టం అవుతుందనే తమ విశ్వాసం అని అన్నారు.మొదటి నుండి ఓరుగల్లు టీఆర్‌ఎస్ పార్టీ వెంట కేసీఆర్‌కు అండగా నిలిచిన జిల్లా అని అన్నారు. 2014,2018 ఎన్నికల్లో కూడా ఈ జిల్లా ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి పట్టం కట్టారని కడియం వెల్లడించారు.