వరంగల్

కాంగ్రెస్ త్యాగాల పార్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరుూంనగర్, జూన్ 17: కాంగ్రెస్ పార్టీ త్యాగాల పార్టీ అని, తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాగాంధీదే అని టిపిసిసి ప్రధాన కార్యదర్శి, వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ అజ్మత్ ఉల్లా హుస్సేన్ అన్నారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిధిగా పాల్గొన్న అజ్మత్ ఉల్లా హుస్సేన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 130సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అందరు తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా అడ్డుబడినా, ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చారన్నారు. గ్రామ కమిటీ, మండల కమిటీ డివిజన్, బూత్ కమిటీలు వేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్త్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కాంగ్రెస్ హాయంలో అవలంభించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెల్లాలని అన్నారు. ఎన్నికలు వచ్చినపుడు అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే వాటిని గాలికొదిలేసి మరికొన్ని కొత్త హామీలను ప్రజలకు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతుందని అన్నారు. పనిచేసేవారికి గుర్తింపు లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ పదవులు అనుభవించి కోట్లు సంపాదించి తమ ఆస్తులను కాపాడుకోవడానికి పార్టీకి ద్రోహం చేసిన వారిని తిరిగి మళ్లీ పార్టీలోకి చేర్చుకోకుడదని అన్నారు. తెరాస పార్టీ అవకాశవాది పార్టీ అని అధికారంలోకి రాక ముందు దళితులను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కెసిఆర్, కుటుంబానికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన కెసిఆర్, తెలంగాణ ఇస్తే టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పి మోసం చేశారన్నారు. కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి, డిసిసిబి చైర్మన్ రాఘవ రెడ్డి, బత్తిని శ్రీనివాస్, బక్కజడ్సన్, టిపిసిసి మాజీ కార్యదర్శులు ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్, ఈవి శ్రీనివాస్, కొత్తపెల్లి శ్రీనివాస్, పద్మ, టి.వీరన్న, అశోక్, మేకల ఉపేందర్, పసునూరి మనోహర్, జనార్దన్ గౌడ్, గణేశ్, నిశాంత్, బుచ్చిరెడ్డి, వాసుదేవరెడ్డి, కందుకూరి రజనీకాంత్, విజయ్ పాల్గొన్నారు.