వరంగల్
హరితహారం ప్రపంచానికే ఆదర్శం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 23 July 2016
రేగొండ, జూలై 22: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం ప్రపంచంలోనే ఆదర్శవంతంగా నిలుస్తుందని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శుక్రవారం రేగొండ మండలంలోని కొడవటంచ శ్రీలక్ష్మినర్సింహస్వామి ఆలయ అధీనంలో ఉన్న మూడు ఎకరాల వ్యవసాయ భూమిలో హరితహార కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తులు సామూహికంగా కార్యక్రమంలో పాల్గొని 5 వేల జామా, మామిడి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటి వారి చేత తాను స్వయంగా రాసిన హరితహారం ప్రతిజ్ఞను చేయించారు.