వరంగల్

‘దురంతో’లో సాంకేతిక లోపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 28: సికింద్రాబాద్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్లే దురంతో ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన దురంతో ఎక్స్‌ప్రెస్ భువనగిరి రైల్వేస్టేషన్‌కు చేరుకోగానే అందులోని ఎసి కోచ్ మొరాయించింది. ఎసి పనిచేయకపోవడంతో ప్రయాణికులంతా ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రైలును అక్కడి నుంచి కాజీపేట వరకు తీసుకొచ్చారు. కాజీపేటలో మరమ్మతుకు ప్రయత్నించిన కాకపోవడంతో ఎసి కోచ్‌ను తొలగించి అందులో ఉన్న దాదాపు 70మంది ప్రయాణికులను కాజీపేట రైల్వేస్టేషన్‌లో దింపివేసి అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో వారందర్ని వరంగల్ రైల్వేస్టేషన్ తరలించారు. అదే సమయంలో విజయవాడ నుంచి ఢిల్లీకి వెళ్లే ఎపి ఎక్స్‌ప్రెస్‌లో ఈ ప్రయాణికులందరినీ అందులో పంపించారు. దీంతో దురంతో ఎక్స్‌ప్రెస్ గంటసేపు కాజీపేట రైల్వేస్టేషన్‌లో నిలిచిపోయింది.