వరంగల్
రెండేళ్లకు సరిపడే వర్షాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 30 September 2016
శాయంపేట, సెప్టెంబర్ 29: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో రెండేళ్లకు సరిపడా వర్షం నీరు చేరిందని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. బుధవారం మండలంలోని నూర్జాన్పల్లి గ్రామంలో నిర్వహించిన తీజ్ ఉత్సవాలలో స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ తీజ్ ఉత్సవాలు ప్రారంభం నుండి తొమ్మిది రోజులుగా నిష్టతో ఉండి వేడుకలు జరుపుకుంటారని తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గంలో హరితహార కార్యక్రమంలో భాగంగా 50 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒకరి బాధ్యతగా గుర్తించాలని కోరారు.