వరంగల్
గోదావరి జలాలను శాశ్వతంగా అందిస్తా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 1 October 2016
పరకాల, సెప్టెంబర్ 30: అటవీ గ్రామాలకు గోదావరి జలాలు శాశ్వతంగా అందించి సస్యశ్యామలం చేస్తానని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శుక్రవారం భూపాలపల్లి మండలంలోని దీక్షకుంట, నందిగామ, పంబాపూర్, గొల్లబుద్దారం గ్రామాలకు గోదావరి జలాలను మళ్లీంచగా స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో భీం ఘణపురం చెరువు నుండి పైపులైన్ ద్వారా శాశ్వతంగా నీటిని చెరువుల్లోకి పంపించేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తున్నామన్నారు. నీటి సమస్య ఉందని ఆయా గ్రామాల ప్రజలు తమ దృష్టికి తీసుక రావడంతో నీటి పారుదల శాఖ మంత్రి హరిప్రావులతో పాటు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడడంతో చెరువులను గోదావరి జలాలతో నింపి సమస్య తాత్కాలికంగా పరిష్కరించామన్నారు.