వరంగల్

బంగారు తెలంగాణ కల సాకారమైనట్లే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరిపెడ, అక్టోబర్ 25: సిఎం కేసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలవుతున్నాయని, వాటి ఫలాలు ప్రతి ఒక్కరికి చేరేలా తొడ్పాటునందిస్తే బంగారు తెలంగాణ సాకారమైనట్లే అని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. మంగళవారం ఎల్లంపేట పెద్ద చెరువులో ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న 75వేల మేలు రకం చాపపిల్లలను టిఆర్‌ఎస్ నాయకులు మత్స్యకారులతో కలసి ఎమ్మెల్యే చెరువులో వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ.. సిఎం కేసిఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 45వేల చెరువుల్లో 48వేల కోట్లు ఖర్చు చేసి చెపపిల్లలను మత్స్యకారులకు అందజేయడం జరుగుతుందన్నారు. కేసిఆర్ చేసిన చండీయాకం ఫలితంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసాయని, రైతులు ఆనందోత్సవాలతో ఉన్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదారణకు గురైన కులవృత్తులను ఆర్థికంగా బలోపెతం చేసేందుకు కేసిఆర్ కృషి చేస్తున్నారన్నారు.