జాతీయ వార్తలు

ఆస్తి తగాదాలతో భర్తను చంపిన భార్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘజియాబాద్‌ ( ఉత్తరప్రదేశ్‌): ఆస్తి తగాదాలతో భార్యే భర్తను చంపిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. తండ్రి జితేంద్ర సింగ్‌ తోమర్‌ జూన్‌ 26 నుంచి కనిపించడం లేదని ఆయన కూతురు కవినగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయన కుమారుడు అమిత్‌, కారు డ్రైవర్‌ ప్రవీణ్‌ను ప్రశ్నించారు. తల్లి, కారు డ్రైవర్‌లతో కలిసి తండ్రిని హత్య చేసినట్లు అమిత్‌ అంగీకరించారు. ఆస్తి తగాదాల కారణంగానే ఆయనను హత్య చేసినట్లు నిందితులు విచారణలో వెల్లడించారు. కుమారుడిని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, జితేంద్ర భార్య కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.