జాతీయ వార్తలు

పూరీ తీరాన వెల్లివిరిసిన నారీశక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒడిస్సా: నేడు అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా పూరీ సముద్ర తీరాన నారీశక్తి వెల్లివిరిసింది. ప్రముఖ సైకిత శిల్పి సుదర్శన్ పట్నాయక్ శిష్యులు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ రూపొందించిన ప్రత్యేక సైకిత శిల్పాలు చూపురులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మహిళలు పురుషులకు ఏవిషయంలోనూ ఏమాత్రం తీసిపోరన్నట్లు ఈ సైకిత శిల్పాలు ఉన్నాయి. సైకిత శిల్పి సుదర్శన్ పట్నాయక్ బహ్రెయిన్‌లో ఉన్నారు. అక్కడ ఆయన సముద్ర తీరాన బహ్రెయిన్ సుప్రీం ఫర్ విమెన్ ప్రెశిడెంట్ హెచ్ ఆర్ హెచ్ సబికా చింత్ ఆల్ ఖలీఫా సైకిత శిల్పంతో మహిళలకు శుభాకాంక్షలు చెప్పారు. లింగ వివక్షతకు వ్యతిరేకంగా, మహిళా సాధికారితకు పాటుపడదామని పిలుపునిచ్చారు.