S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

01/22/2019 - 03:13

కొమరాడ, జనవరి 21: విజయనగరం జిల్లా కొమరాడ మండలం శివిని గ్రామం వద్ద రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బొబ్బిలి మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన సీహెచ్ చంద్రశేఖర్(19), పి కృష్ణవేణి(18) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

01/22/2019 - 02:33

చెన్నై, జనవరి 21: రాజ్యాంగాన్ని సవరించి ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. జనరల్ కేటగిరీ కింద ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగానికి విరుద్ధమని డీఎంకే మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం వాదనలు జరిగాయి.

01/22/2019 - 01:59

జి.కొండూరు, జనవరి 21: కొండపల్లి పారిశ్రామిక వాడలోని ఐరన్ ఫ్యాక్టరీలో కార్మికుడు దుర్మరణం చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం మండల పరిధిలోని పినపాక శివారు కడిం పోతవరం గ్రామ పరిధిలో ఉన్న కామాక్షి స్టీల్స్ కంపెనీలో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో మున్నా ప్రభాస్ (23) అనే కార్మికుడు దుర్మరణం చెందాడు. ఇనుము స్తంభాలు మీద పడి ఇతను మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు.

01/22/2019 - 01:53

విజయవాడ (క్రైం), జనవరి 21: నగరంలో ఓ గాజుపెట్టె కలకలం రేపింది. టాస్క్ఫోర్స్ పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకోగా వారి వద్ద ఈ పెట్టె బయటపడింది. పెట్టె ఉన్న తీరును బట్టి తొలుత ఊహాగానాలు ఊపందుకున్నాయి. రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయనే అనుమానంతో బాక్సును కృష్ణానదీ తీరానికి తీసుకెళ్లి కొన్ని గంటలపాటు కసరత్తు చేసిన మీదట ఎట్టకేలకు తెరిచారు.

01/22/2019 - 01:53

విజయవాడ (క్రైం), జనవరి 21: గతంలో సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి వివరాలు తెలిస్తే చెప్పాలని ప్రజలను కోరుతూ సీబీఐ బహిరంగ ప్రకటన చేసింది. కేసుకు సంబంధించి ఎవరైనా తమకు తెలిసిన సమాచారం, వివరాలు తెలియచేసేందుకు ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌తోపాటు టోల్‌ఫ్రీ నెంబర్ విడుదల చేసింది. సమాచారం తెలియచేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సీబీఐ డీఐజీ తెలియచేశారు.

01/22/2019 - 01:38

వనస్థలిపురం, జనవరి 21: గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఓట్లు వేయడానికి గ్రామాలకు వెళ్లిన ఇళ్లల్లో దొంగలు పట్టపగలే దొంగతనాలకు పాల్పడి పోలీసులకు సవాలు విసిరారు. ఈసంఘటన సోమవారం ఎల్బీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని మల్లిఖార్జున్ నగర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

01/22/2019 - 01:37

వికారాబాద్, జనవరి 21: అదుపుతప్పి కారు బోల్తా పడటంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన వికారాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం పరిగి మండలం రుక్కుంపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్ అతని భార్య కష్ణవేణి(28) హైదరాబాద్‌కు చెందిన బంధువులతో కలిసి అనంతగిరి వెళ్ళేందుకు వికారాబాద్‌కు బయలుదేరారు.

01/22/2019 - 01:25

న్యూఢిల్లీ, జనవరి 21: తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి చివరికల్లా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక సాదుపాయాల కల్పనతోపాటు, ఉపాధ్యాయుల నియామకాల్లో జాప్యం జరుగుతోందని జేకే రాజు, వెంకటేశ్, తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

01/22/2019 - 02:51

వారణాసి, జనవరి 21: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం నాగేశ్వరరావునియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణను నుంచి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తప్పుకున్నారు. ఈనెల 10న నాగేశ్వరరావును సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. కాగా సీబీఐ డైరెక్టర్ ఎంపిక కమిటీ ఈనెల 24న సమావేశం కానుంది.

01/22/2019 - 04:37

విజయవాడ (క్రైం): ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణపై స్టే ఇచ్చేందుకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. ఈ కేసు దర్యాప్తును కేంద్రం ఎన్‌ఐఏకు అప్పగించటాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రావడంతో ప్రభుత్వం తరుఫు వాదనలను హైకోర్టు ఆలకించింది.

Pages