S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
2018లో రంగస్థలం వంటి బ్లాక్బస్టర్ హిట్ అందించి.. మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా’ అంటూ చిత్రాన్ని నిర్మిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్చరణ్ ముఖ్య అతిథిగా ‘హ్యాపీ వెడ్డింగ్’ గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ నేడు (21న) జరగనుంది. ఈ ఈవెంట్ను గ్రాండ్గా ప్లాన్ చేసింది చిత్ర యూనిట్.
సూపర్స్టార్ రజనీకాంత్ మరోసారి డాన్ పాత్రలో కనిపించనున్నాడా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. రజనీకాంత్ డాన్గా నటించిన బాషా సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. చాలా గ్యాప్ తరువాత కబాలిలో డాన్గా కనిపించిన రజనీ.. లేటెస్టుగా కాలా సినిమాలో కూడా డాన్గా కనిపించాడు. తాజాగా ఆయన మరోసారి డాన్ పాత్రలో కనిపిస్తాడట.
సంగకుమార్ నటిస్తూ నిర్మిస్తున్న థ్రిల్లర్ ఎంటర్టైనర్ ‘తాంత్రిక’. ఎం.శ్రీ్ధర్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్కాంత్, కార్తీక్, మనీషా, సంజన, గీతాషా, ఆర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్ర గీతాలు విడుదలయ్యాయి. జాన్, నాగవంశీ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను సాయి వెంకట్ విడుదల చేశారు. తొలి ప్రతిని సంగకుమార్ స్వీకరించారు.
శ్రీ నవ నారాయణ సినీ క్రియేషన్స్ పతాకంపై అభయ్, గీత్ షా హీరోహీరోయిన్లుగా నాగరాజు తలారి దర్శకత్వంలో అంజనప్ప, నాగరాజ నిర్మాతలుగా నిర్మిస్తున్న యాక్షన్ సెంటిమెంట్ కామెడీ చిత్రం ‘జిగేల్ జిగేల్’. ఈ చిత్రం ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి హీరోహీరోయిన్లుపై ప్రముఖ పారిశ్రామికవేత్త పట్నం యాదగిరి క్లాప్ ఇచ్చారు. సింగర్ నేహా వౌష్మి కెమెరా స్విచ్ ఆన్చేశారు.
సుధీర్బాబు, అదితీరావు హైదరీ జంటగా నటించిన ‘సమ్మోహనం’ చిత్రం క్లైమాక్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో తనికెళ్ల భరణి ‘తారలు దిగివచ్చిన వేళ’ అంటూ.. అందులోని ఓ బుజ్జి కథను చదువుతారు. ఆ కథలో సినిమా కథ అంతర్లీనంగా ఉంటుంది. ఆ సినిమా విడుదలైనప్పటినుంచి ‘తారలు దిగి వచ్చినవేళ’ పుస్తకం కానె్సప్ట్ బావుందని పలువురు మెచ్చుకుంటున్నారు.
బెల్లంకొండ సాయిశ్రీనివాస్, పూజాహెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాక్ష్యం’ చిత్రం ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుండగా ఈ చిత్రానికి ప్రఖ్యాత నటుడు ప్రకాష్రాజ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. కథాగమనానికి వాయిస్ ఓవర్ అనేది చాలా కీలకం, అందులోనూ ‘సాక్ష్యం’లాంటి చిత్రానికి స్క్రీన్ప్లే చాలా కీలకం.
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సుప్రియా యార్లగడ్డ మళ్లీ వెండితెరకు ‘గూఢచారి’తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో సుప్రియా పోషిస్తున్న నదియా ఖురేషి పాత్ర లుక్ను ఇవాళ విడుదల చేశారు. రా ఏజెన్సీకి చెందిన త్రినేత్ర అనే సీక్రెట్ ఏజెన్సీకి వర్క్ చేసే సీక్రెట్ ఏజెంట్గా మిస్టీరియస్ ఏజెంట్గా కనిపించే ఈమె రా ఏజెన్సీలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ చీఫ్ టాస్క్ ఇనె్వస్టిగేషన్ డిపార్ట్మెంట్.
ఏ ప్రాంతీయ భాషలో నైనా హీరో హీరోయిన్గా క్రేజ్ తెచ్చుకున్న తారలు కనీసం ఒక్క సినిమా అయినా బాలీవుడ్లో చేయాలని అనుకుంటారు. ఎందుకంటే బాలీవుడ్లో ఒక్క సినిమా చేస్తే చాలు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకోవచ్చు. ఈవిషయంలో ఎక్కువగా హీరోయిన్స్ ఫోకస్ చేస్తుంటారు. ఇక బాలీవుడ్ నుండి కూడా సౌత్లో హీరోయిన్స్గా క్రేజ్ తెచ్చుకున్న భామలు ఉన్నారు. తాజాగా ఈ అందాల రాక్షసి ఫోకస్ బాలీవుడ్పై పడింది.
సూపర్స్టార్ మహేష్బాబు హీరోగా నటిస్తున్న 25వ సినిమా ఇటీవలే డెహ్రాడూన్లో షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్లో రెండో షెడ్యూల్ మొదలైంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్రాజు, అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ రెండు పాత్రల్లో కనిపిస్తాడన్న విషయం తెలిసిందే.
విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న కథానాయకుడు సుమంత్ నటిస్తున్న వైవిధ్యమైన చిత్రం ‘ఇదం జగత్’. ఈ చిత్రం ద్వారా అంజుకురియన్ నాయికగా పరిచయమవుతోంది. విరాట్ ఫిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనీల్ శ్రీకంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీ్ధర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.