S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/14/2016 - 21:56

‘అవకాశాలు లేవని బాధపడడం వృధా. ఇక్కడ పనికి ఏమాత్రం కరువులేదు. అయితే, ఆ పనికి మనం సరిపోతామా లేదా అన్న నమ్మకం కలిగిస్తే చాలు, అవకాశాలు వాటికవే వస్తాయి’ అంటోంది తాప్సీ. దక్షిణాదిలో అనేక చిత్రాల్లో నటించినా గుర్తింపు రాకపోవడంతో బాలీవుడ్‌కి వెళ్లింది. అక్కడ కొద్దో గొప్పో అవకాశాలు వస్తున్నాయి, మంచి నటిగా నిరూపించుకుంటోంది. తాజాగా ఆమె నటించిన ‘పింక్’ చిత్రం గురించి బాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.

09/14/2016 - 21:54

కథానాయికగా కానె్సప్ట్ ఓరియంటెడ్ కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించడానికి నయనతార ముందడుగు వేస్తోంది. ఆమె కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో ఓ హారర్ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి ‘డోర’ అనే పేరును ఖరారు చేశారు. దాసు రామస్వామి దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ తెలుగులో దీన్ని అందిస్తున్నారు.

09/14/2016 - 21:52

‘బాహుబలి’ తొలి చిత్రం విడుదలైనప్పటినుండీ రెండవ చిత్రం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన బాహుబలి రెండో సినిమాను ప్రారంభించి దాదాపు మూడేళ్లు దాటింది. హీరోగా నటిస్తున్న ప్రభాస్, రాణాలు ఇద్దరూ ఈ చిత్రంతోనే మమేకమై సాగుతున్నారు. ఇన్నాళ్లకు రాణాకు బాహుబలి చిత్రంలో బాహుబలి చిత్రానికి సంబంధించిన పేకప్ చెప్పారు.

09/14/2016 - 21:51

విశాల్ కథానాయకుడిగా తమన్నా హీరోయినగా సురాజ్ దర్శకత్వంలో నిర్మాత జి.హరి అందిస్తున్న చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై అందిస్తున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, విశాల్ కెరీర్‌లో భారీ బడ్జెట్ చిత్రంగా యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మంచి మ్యూజిక్‌తో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని తెలిపారు.

09/14/2016 - 21:46

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతకంపై నవీన్ చంద్ర, శృతి సోది జంటగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ రూపొందిస్తున్న తాజా చిత్రానికి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అన్న పేరును ఖరారు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ పూర్తయిందని, ఒక పాటను ఈనెలలోనే అరకులో చిత్రీకరించడానికి సన్నాహాలు జరుపుతున్నామన్నారు.

09/14/2016 - 21:44

యూనిక్రాఫ్ట్స్ మూవీ పతాకంపై ఆర్.పి.పట్నాయక్ నటిస్తూ సంగీతం అందిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘మనలో ఒకడు’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవల విడుదలైంది. అనితా.హెచ్.రెడ్డి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విజయోత్సవ వేడుక తిరుపతిలో ఈ నెల 19న జరగనుంది.

09/14/2016 - 21:42

‘నా వెనుక అభిమానులున్నారు. ఇన్నాళ్లు నా విజయం కోసం ఆగారు. వారు తలెత్తుకునేలా చేసిన ‘జనతా గ్యారేజ్’ చిత్రాన్ని రూపొందించిన దర్శక నిర్మాతలకు రుణపడి వుంటాను’ అని ఎన్టీఆర్ తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, సమంత, నిత్యామీనన్ ప్రధాన తారాగణంగా ఎర్నేని నవీన్, ఎలమంచిలి రవిశంకర్, సి.వి.రాంమోహన్ సంయుక్తంగా రూపొందించిన ‘జనతా గ్యారేజ్’ విడుదలైన సంగతి తెలిసిందే.

09/14/2016 - 21:39

రోషన్, శ్రీయా శర్మ జంటగా నటించిన ‘నిర్మలా కానె్వంట్’ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని 16న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా రోషన్ తల్లిదండ్రులు హీరో శ్రీకాంత్, ఊహా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.

09/14/2016 - 21:31

అభి, వరుణ్, ఫణి, సందీప్తి ప్రధాన పాత్రధారులుగా శ్రీలక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నరసింహనంది దర్శకత్వంలో బూచేపల్లి తిరుపతిరెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను హైదరాబాద్ ఫిలిం చాంబర్ హాల్‌లో ఎం.పి. వై.వి.సుబ్బారెడ్డి బుధవారం ఆవిష్కరించారు.

09/14/2016 - 21:30

శ్రీవత్స క్రియేషన్స్ పతాకంపై శశిభూషణ దర్శకత్వంలో కమల్‌కుమార్ పెండెం రూపొందిస్తున్న చిత్రం ‘పిచ్చిగా నచ్చావ్’. ఉత్తేజ్ తనయ చేతన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను హీరో శర్వానంద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- బాలనటిగా అనే చిత్రాల్లో నటించిన చేతన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం హిట్ అవ్వాలంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Pages