జాతీయ వార్తలు

తొలి అడుగులోనే విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జూన్ 5: వరుస రాకెట్ విజయాలతో భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ కీర్తి ప్రతిష్టలు ప్రపంచ దేశాలకు పాకడమే కాకుండా మంచి గుర్తింపు సైతం సంపాదించుకుంది. ఇక్కడ నుండి ప్రయోగించే ప్రతి రాకెట్ స్వదేశీ పరిజ్ఞానం కావడం ఒకవంతైతే వినూత్న ప్రయోగాలు చేపట్టి మన శాస్తవ్రేత్తలు ప్రపంచ దేశాలకు దీటుగా నిలుస్తున్నారు. అంతేకాకుండా తక్కువ ఖర్చుతో భారీ ప్రయోగాలు చేపట్టి వాణిజ్య పరంగా ఇతర దేశాల నుండి కాసుల వర్షం కురుపిస్తున్నారు. ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి ప్రయోగించిన జీశాట్-19 భారీ రాకెట్ ప్రయోగం తొలి అడుగులోనే విజయవంతం కావడంతో శాస్తవ్రేత్తల ఉత్సాహం ఉరకలేస్తున్నాయి. అత్యంత బరువైన రాకెట్‌ను సవాల్‌గా తీసుకొని తొలిసారి ప్రయోగించి కమ్యూనికేషన్ రంగాల్లో అభివృద్ధి చెందిన అమెరికా, రష్యా, జపాన్ దేశాలకు దీటుగా నిలిచారు. విదేశాలు సైతం అసాధ్యమన్న దానిని మన శాస్తవ్రేత్తలు సుసాధ్యం చేశారు. ఏకంగా 17 ఏళ్ల కలల సాకారాన్ని నిజం చేశారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి సోమవారం సాయంత్రం 5గంటలకు 28నిమిషాలకు జిఎస్‌ఎల్‌వి-మార్క్ 3-డి1 రాకెట్ ద్వారా జీశాట్-19 ఉపగ్రహాన్ని అనుకొన్న భూస్థిర కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. మన దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకొని 17ఏళ్ల క్రితం భారీ ప్రయోగాలు చేపట్టేందుకు శ్రీకారం చుట్టిన ఇస్రో ఆ కలను సాకారం చేసింది. దేశానికి మెరుగైన సమాచార వ్యవస్థను అందించేందుకు ఈ ఉపగ్రహాన్ని రూపకల్పనచేసి విజయవంతంగా ప్రయోగించారు. దీంతో ఇస్రో ప్రతిష్ట కూడా ఇనుమడించి ఆగ్ర దేశాల సరసర భారత్ నిలిచింది. ఇప్పటి వరకు షార్ నుండి మొత్తం 11 జిఎస్‌ఎల్‌విలు ప్రయోగాలు జరిగాయి. ఇది 12వ ప్రయోగం కావడమే కాకుండా దేశ అసవరాల కోసం భారీ రాకెట్‌ను స్వదేశీ క్రయోజనిక్‌తో ఉపగ్రహ ప్రయోగం చేపట్టి దిగ్విజయం చేశారు. చిన్న రాకెట్ల నుండి మొదలు పెట్టిన బుడిబుడి అడుగులు వేసుకొంటున్న ఇస్రో శాస్తవ్రేత్తల ప్రయోగాలు నేడు భారీ ప్రయోగాల వైపు పరుగులు తీసే స్థాయికి చేరాయి. శ్రీహరికోట నుండి సోమవారం ప్రయోగించిన జిఎల్‌ఎల్‌వి-మార్క్ 3 ద్వారా 3,136 కిలోల బరువు గల ఉపగ్రహాన్ని 16: 20మిషాల్లో భూమధ్య రేఖకు 36వేల కి.మీ దూరంలో భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ప్రయోగం విజయవంతం కావడంతో షార్‌లో ఉద్యోగులందరూ సంబరాలు చేసుకొన్నారు. షార్‌తో పాటు పక్కనే సూళ్లూరుపేట పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.