విశాఖ
హెచ్ఎస్ఎల్ను సందర్శించిన ఏపీ సింగ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 21 January 2018
విశాఖపట్నం, జనవరి 20: గోపాల్పూర్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కళాశాల లెఫ్ట్నెంట్ జనరల్ ఏపీ సింగ్ నగరంలోని హింధుస్థాన్ షిప్యార్డ్ను శనివారం సందర్శించారు. షిప్యార్డ్ డైరెక్టర్ ఎఎస్ మిత్ర స్వయంగా ఏపీ సింగ్కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎఎస్ మిత్ర షిప్యార్డ్ స్థితిగతులను వివరించారు. షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్స్, సబ్మెరైన్ రిపేర్ ప్రాజెక్టులను వివరించారు. అనంతరం జనరల్ ఏపీ సింగ్ మాట్లాడుతూ హింధుస్థాన్ షిప్యార్డు పనితీరును కొనియాడారు. గత సంవత్సరం రూ.629 కోట్ల టర్నోవర్తో రూ.54 కోట్ల లాభాలను సాధించడం సంస్థ అద్భుత పనితీరుకు నిదర్శనమని కొనియాడారు. అలాగే ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం నిమిత్తం సంస్థ తీసుకుంటున్న చర్యలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.