జాతీయ వార్తలు

నగ్నంగా మహిళ ఊరేగింపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్రాహ్ (బిహార్), ఆగస్టు 21: బిహార్‌లో ఒక మహిళపై దౌర్జన్యం చేసి నగ్నంగా ఊరేగించిన ఘటన వివాదస్పదమవుతోంది. ఈ కేసులో స్థానిక ఆర్‌జీడీ పార్టీ కార్యకర్తతో పాటు 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు 8 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన బిహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ మహిళ ఒక వ్యక్తి హత్యకు కారణమన్న అనుమానంతో స్థానిక ప్రజలు ఆమెను నగ్నంగా ఊరేగించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పాట్నాకు 60 కి.మీ దూరంలోని బిహియా బ్లాక్‌లో చోటుచేసుకుంది. ఈ నెల 19న విమలేష్ సహా అనే యువకుడు మిస్సయినట్లు కేసు నమోదు చేశారు. అనంతరం ఇక్కడి గ్రామంలో రైలు పట్టాల పక్కన శవమై తేలాడు. దీంతో గ్రామస్థులు ఘటనా ప్రదేశానికి చేరుకుని తమ యువకుడు మరణించిన విషయాన్ని తెలుసుకున్నారని ఎస్పీ అవకర్ష్ కుమార్ చెప్పారు. సమీపంలో ఉన్న ఒక రెడ్‌లైట్ ఏరియాకు చెందిన యువతే యువకుడిని హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానించారు. దీంతో ఆగ్రహం చెందిన స్థానిక ప్రజలు ఆ యువపై దాడిచేసి నగ్నంగా ఊరేగించారని పోలీసులు చెప్పారు. ఆర్జేడీ కార్యకర్త ఈ ప్రదర్శనను దగ్గరుండి ప్రోత్సహించారనే అభియోగం ఉంది. కాగా ఈ ఘటనపై అధికార, విపక్ష పార్టీలు మాటల తూటాలు విసురుకుంటున్నాయి. మంగళవారం ఉద్రిక్తత నెలకొనడంతో, కొంతమంది ఆవేశానికి లోనై ప్రదర్శనపై రాళ్లు విసిరారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ డిమాండ్ చేశారు.