జాతీయ వార్తలు
తమిళనాడు అతలాకుతలం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 16 November 2018
చెన్నై: గజ తుపాను వల్ల తమిళనాడుకు తీవ్ర నష్టం వాటిల్లింది. నాగపట్నం-వేదారణ్య మధ్య ఈ తుపాను తీరం దాటింది. ఈ సందర్భంగా 110 కి.మీ వేగంతో వీచిన గాలులకు తీరప్రాంతాల ప్రజలు వణికిపోయారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. నాగపట్నం, కడలూరు జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. తంజావూరు పట్నం ఆదిరామ్ పట్నంలో అత్యధికంగా 16శాతం వర్షపాతం నమోదు అయింది. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.