జాతీయ వార్తలు
ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 13 December 2019
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల్లో వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ బిల్లు, చిట్ఫండ్ (సవరణ), ఎస్పీజీ బిల్లులు ఆమోదించారు. కాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన రేప్ ఇన్ ఇండియా వాఖ్యలపై ఉభయ సభల్లోని మహిళా ఎంపీలు మండిపడ్డారు. దీనిపై రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయగా ఆయన క్షమాపణ చెప్పనని ఇందుకు సంబంధించిన వీడియో సందేశాన్ని పంపారు. తదనంతరం ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.