జాతీయ వార్తలు

ఉగ్రవాదుల చేతిలో పాక్ ఆయుధాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, అక్టోబర్ 8: పిఓకె నుంచి భారత్‌లోకి చొరబడుతూ సైన్యం చేతిలో హతమైన ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, గ్రెనేడ్లు, మందులు పాకిస్తాన్‌లోనే తయారయ్యారని ఆర్మీ ప్రతినిధి ఒకరు తెలిపారు. గురువారంనాడు భారత్‌లోకి చొరబడుతున్న నలుగురు ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చిన విషయం తెలిసిందే.
వారినుంచి స్వాధీనం చేసుకున్న గ్రెనేడ్లపై పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులున్నాయని ఆ ప్రతినిధి తెలిపారు. ఈ సంఘటనను బట్టి ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆర్మీయే ఆయుధాలు అందజేస్తున్నదని, ఉగ్రవాదులు పాకిస్తాన్‌కు చెందిన వారేనని ఆయన స్పష్టం చేశారు.