యువక్రీడాకారులకు మహనీయులే స్ఫూర్తి
Published Wednesday, 30 August 2017విజయవాడ (స్పోర్ట్స్), ఆగస్టు 29: యువ క్రీడాకారులు ధ్యాన్చంద్ లాంటి మహనీయ క్రీడా మాంత్రికులను స్ఫూర్తిగా తీసుకోవాలని శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ కఠోర దీక్షతో శిక్షణ పొంది నచ్చిన క్రీడలో ముందుకెళ్లాలని సూచించారు. క్రీడలను ప్రోత్సహించే నేత ముఖ్యమంత్రి చంద్రబాబు అని, అమరావతిలో స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటు చేయనున్నారని పేర్కొన్నారు.