కార్పొరేట్ కాలేజీల్లో పెరిగిన ఆత్మహత్యలు
Published Wednesday, 30 August 2017హైదరాబాద్, ఆగస్టు 29: తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంవత్సరం మొదలై రెండు నెలల వ్యవధిలోనే అపుడే దాదాపు పది మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడటంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు తలొగ్గడం వల్లనే ఇలా జరుగుతోందని, ఇటు కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులపై అనవసరమైన పెంచుతున్నాయని, దాంతో ఒత్తిడి తట్టుకోలేకపోతున్న విద్యార్ధులు ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారని ఎఐఎస్ఎఫ్, ఎబివిపి నేతలు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు.