టిఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా ఏ పార్టీకీ లేదు
Published Sunday, 26 March 2017మహబూబ్నగర్, మార్చి 26: రాష్ట్రంలో టిఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా ఏ పార్టీకి గానీ, ప్రతిపక్షాల నేతలకు గాని లేదని ఆ దమ్ము ధైర్యం ఎవ్వరికీ లేదని, ముఖ్యమంత్రి కెసిఆర్ ముందు ప్రతిపక్ష నాయకులు పటాపంచలు కావాల్సిందేనని మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ పట్టణంలోని ఏనుగొండ, రాజేంద్రనగర్ తదితర కాలనీల్లో టిఆర్ఎస్ సభ్యత్వ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. అదే విధంగా హన్వాడ మండలంలోని వేపూర్, తిర్మలగిరి తదితర గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు మరికొన్ని పనులకు శంకుస్థాపన చేశారు.