మంజునాథ్ కమిటీపై బిసిల్లో సర్వత్రా వ్యతిరేకత!
Published Wednesday, 28 September 2016కడప,సెప్టెంబర్ 27: కాపుల (బలిజలు)ను బిసి జాబితాలో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన మంజునాథ్ కమిషన్ పట్ల బిసిల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురౌతోంది. ఆదివారం రాత్రి, సోమవారం , మంగళవారం జిల్లాలో కమిటీ మకాం వేసి కాపునేతలతోనే సన్నిహితంగా ఉండటంతో సోమవారం జెడ్పిసమావేశ మందిరంలో బిసి కులాల సంఘం నేతలు ఇచ్చిన దరఖాస్తులు, వినతిపత్రాలు బుట్టదాఖలు చేసినట్లు పలువురు బిసి నేతలు భావిస్తున్నారు.