కాంట్రాక్టు లెక్చరర్లను మోసగించిన ప్రభుత్వం
Published Wednesday, 28 September 2016కాకినాడ రూరల్, సెప్టెంబర్ 27: కాంట్రాక్టు లెక్చరర్లను ప్రభుత్వం మోసం చేసిందని జిల్లా వైసిపి అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. గడపగడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో 49వార్డులో పర్యటించిన ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం అయ్యిందన్నారు. చంద్రబాబునాయుడు, తెలుగుదేశం నాయకులు నోట్ల కోసం ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందు కాంట్రాక్టు లెక్చరర్లను అధికారంలోకి వచ్చిన వెంటనే పర్మినెంట్ చేస్తానని చెప్పిన ఆయన వారిని మోసం చేశారని దుయ్యాబట్టారు. ఈ కార్యక్రమంలో కడియాల చిన్నబాబు, మురళీ, రావూరి వెంకటేశ్వరరావు, లింగం రవి తదితరులు పాల్గొన్నారు.