వౌలిక సదుపాయాలతోనే పెట్టుబడులు
Published Monday, 26 September 2016గుంటూరు, సెప్టెంబర్ 25: వౌలిక సదుపాయాల ప్రాజెక్టులే రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే వారధులని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆదివారం ఉండవల్లిలోని సిఎం నివాసంలో వౌలిక సదుపాయాల కల్పనలో భాగస్వాములైన ఇంధన, వౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, సీఆర్డీయే ఉన్నతాధికారులతో సుమారు మూడు గంటల పాటు సిఎం సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో పెట్టుబడులతో పారిశ్రామిక సంస్థలు విస్తరిస్తాయన్నారు. ఈ కారణంగా ఉపాధి కల్పన మెరుగుపడటంతో రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుందని తెలిపారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు దోహద పడతాయన్నారు.