నేరాల అదుపులో తనదైన ముద్ర
Published Friday, 22 July 2016అనంతపురం, జూలై 21 : జిల్లాలో నేరాలు అదుపు చేయడంతోపాటు శాంతిభద్రతల పరిరక్షణలో ఎస్వి.ఎస్పీ రాజశేఖర్బాబు తనదైన ముద్ర వేసుకుంటూ దూసుకెళ్తున్నారు. ఆయన ఎస్పీగా బాధ్యతలు చేపట్టి నేటికి రెండేళ్లు పూర్తయింది. రెండేళ్ల పాలనలో జిల్లాను ప్రశాంతంగా ఉంచడంతో పాటు, అన్ని వర్గాలను సమన్వయ పర్చుకుని పోలీసు శాఖను ప్రగతి పథంలో నడిపించి విజయం సాధించారనడంలో సందేహం లేదు. అంతేగాకుండా ప్రజల భాగస్వామ్యంతో పోలీసుల స్వచ్ఛ భారత్, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా లక్షల్లో మొక్కల పెంపకం తదితర సామాజిక, సేవా కార్యక్రమాలను సైతం చేపట్టి తనదైన ముద్ర వేశారు.