కొత్తపల్లి పీచేముఢ్
Published Friday, 20 May 2016పటమట, మే 19: పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వైకాపా నుంచి టిడిపి సొంత గూటకి చేరారు. గురువారం సాయంత్రం గురునానక్ నగర్ ఎన్ఏసి కల్యాణ మండపంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టిడిపి పార్టీ జెండాను కొత్తపల్లి సుబ్బారాయుడి మెడలో వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో పుట్టి, పెరిగిన కొత్తపల్లి సుబ్బారాయుడు ఒక పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ సొంత గూటికి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు.