అన్ని రంగాల్లో పరిగి అభివృద్ధి
Published Friday, 20 May 2016పరిగి, మే 19: నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తానని చేవెళ్ళ ఎంపి కొండా విశే్వశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం పరిగి పట్టణంలోని రోడ్, సయ్యద్పల్లి గ్రామాంలోని సిసి రోడ్లకు మురుగు కాలువల పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపి నిధులతో నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిబాటలో తీసుకు వెళతానని అన్నారు. 75 లక్షల రూపాయలతో పరిగిలో అభివృద్ధి పనులు చేపట్టనున్నామని చెప్పారు. టిఆర్ఎఏస్ పొలిట్బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా కేసిఆర్ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.