S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/24/2016 - 05:28

ఆదిలాబాద్, జూలై 23: సింగరేణి సంస్థ ఆదిలాబాద్ జిల్లా జైపూర్ సమీపంలో నిర్మిస్తున్న బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రం పనులు పూర్తికావడంతో ఆగస్టు 7న ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1,200 మెగావాట్ల జైపూర్ విద్యుదుత్పత్తి ప్రాజెక్టును జాతికి అంకితం చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రానున్నారు.

07/24/2016 - 05:28

హైదరాబాద్, జూలై 23: ప్రముఖ ఆటోరంగ సంస్థ హ్యుందాయ్ యువ ఇంజనీర్లకు పెద్దపీట వేస్తోంది. ఇక్కడి హైటెక్ సిటీ సమీపంలోని హ్యుందాయ్ ఆర్‌అండ్‌డి సెంటర్‌లోకి 50 మంది కొత్త ఇంజనీర్లను తీసుకుంది. ఇప్పటికే ఇక్కడ 750 మంది ఇంజనీర్లు పనిచేస్తుండగా, దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కాలేజీల నుండి క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా కొత్తవారిని ఎంపిక చేసినట్లు ఓ ప్రకటనలో శనివారం సంస్థ తెలిపింది.

07/24/2016 - 05:27

న్యూయార్క్, జూలై 23: అమెరికా టెలికామ్ దిగ్గజం వెరిజోన్ కమ్యూనికేషన్స్.. ఇంటర్నెట్ దిగ్గజం యాహూను కొనుగోలు చేస్తోందా? 5 బిలియన్ డాలర్లకు యాహూను చేజిక్కించుకుంటోందా?. గూగుల్, ఫేస్‌బుక్ ధాటికి తట్టుకోలేకపోయిన యాహూ తమ వ్యాపారాన్ని అమ్మకానికి పెట్టినది తెలిసిందే.

07/24/2016 - 05:25

ముంబయి, జూలై 23: ఇప్పుడిక కార్ల వంతు.. బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలను రుణంగా తీసుకుని, వాటిని చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా కార్లను బకాయిల వసూళ్లలో భాగంగా బ్యాంకర్లు అమ్మకానికి పెడుతున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కూటమికి మాల్యా, ఆయన నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 2014 జనవరి 31 నాటికి బకాయిపడింది 6,963 కోట్ల రూపాయలుగా ఉంది.

07/24/2016 - 05:23

విజయవాడ, జూలై 23: నవ్యాంధ్రలో 30 వేల కోట్ల రూపాయల వ్యయంతో సౌర విద్యుత్ పార్కులను అభివృద్ధి చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో నాలుగు వేల మెగవాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ పార్కులను కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తున్నారు.

07/23/2016 - 00:50

కోల్‌కతా, జూలై 22: దేశీయ ఎఫ్‌ఎమ్‌సిజి దిగ్గజం ఐటిసి.. 2030 నాటికి ప్రతిష్ఠాత్మకంగా లక్ష కోట్ల రూపాయల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. శుక్రవారం ఇక్కడ ఐటిసి 105వ వార్షిక సాధారణ సమావేశం (ఎజిఎమ్) జరిగింది. ఈ సందర్భంగా వాటాదారులనుద్దేశించి సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వైసి దేవేశ్వర్ మాట్లాడుతూ పొగాకు వ్యాపారం వృద్ధిపథంలోనే కొనసాగుతోందని చెప్పారు.

07/23/2016 - 00:46

హైదరాబాద్, జూలై 22: తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన కూరగాయాలు’ పథకం విజయవంతం కావడంతో త్వరలోనే హైదరాబాద్‌లో 100 ఔట్‌లెట్‌లను ప్రారంభించబోతున్నట్టు మార్కెటింగ్ శాఖ మంత్రి టి హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడానికి, మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అనేక చర్యలు చేపట్టినట్టు మంత్రి వివరించారు.

07/23/2016 - 00:45

హైదరాబాద్, జూలై 22: పాలిమర్ పైపుల ఉత్పత్తి రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన స్కిప్పర్ సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో తొలిసారిగా హైదరాబాద్‌లో పాలిమర్ పైపుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ డైరెక్టర్ దేవేష్ బన్సల్ తెలిపారు.

07/23/2016 - 07:27

న్యూఢిల్లీ, జూలై 22: పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్), ట్యాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అకౌంట్ నెంబర్ (టాన్)లను ఇక ఒక్కరోజులోనే సంస్థలు పొందవచ్చు. అవసరమున్న సంస్థలు డిజిటల్ సిగ్నేచర్ సర్ట్ఫికెట్ ఆధారిత దరఖాస్తును సమర్పిస్తే చాలు.. 24 గంటల్లోనే పాన్, టాన్ రిజిస్ట్రేషన్ అందుతుంది. వ్యాపార నిర్వహణ సులభతరం చేయడంలో భాగంగానే ఈ సంస్థాగత మార్పు అని ఆదాయ పన్ను శాఖ శుక్రవారం తెలిపింది.

07/23/2016 - 00:42

ముంబయి, జూలై 22: దేశీయంగా ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో మూడో అతిపెద్ద బ్యాంకైన యాక్సిస్ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 21 శాతం క్షీణించి 1,555.5 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో 1,978.44 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 13,852.1 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 12,234.41 కోట్ల రూపాయలుగా ఉంది.

Pages