-
వాషింగ్టన్: చైనా కరోనా వైరస్ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరించిందని, ఈ సమాచారాన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అంతర్జాతీయం
ఈక్వెడార్కు చెందిన కేథరీన్ ఎస్పిన్ 2016 సంవత్సరానికి మిస్ ఎర్త్గా
ఎంపికైంది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా సమీపంలోని పాసే నగరంలో
శనివారం జరిగిన గ్రాండ్ ఫైనల్లో విజేతగా నిలిచిన కేథరిన్కు
నిరుటి విజేత అంజెలియా ఓంగ్ మిస్ ఎర్త్ కిరీటాన్ని అలంకరించింది.
వాషింగ్టన్, అక్టోబర్ 29: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన మిత్రుడైన ప్రవాస భారతీయుడికోసం అత్యంత అరుదుగా టీవీ యాడ్లో దర్శనమిచ్చారు.
బీజింగ్, అక్టోబర్ 28: టిబెట్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామాను అరుణాచల్ప్రదేశ్లో పర్యటించేందుకు అనుమతిస్తే ద్వైపాక్షిక సంబంధాలకు నష్టం వాటిల్లడంతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతలకు విఘాతం కలుగుతుందని చైనా శుక్రవారం భారత్ను బెదిరించింది. టిబెట్ దక్షిణ ప్రాంతంలో అరుణాచల్ప్రదేశ్ అంతర్భాగమని చైనా దీర్ఘ కాలం నుంచి వాదిస్తున్న విషయం తెలిసిందే.
బ్రిస్బేన్, అక్టోబర్ 28: ఆస్ట్రేలియాలో దారుణం చోటుచేసుకుంది. భారతీయ సంతతికి చెందిన ఓ బస్సు డ్రైవర్పై ఓ ప్రయాణికుడు తేలికగా మండే ద్రావకంతో దాడిచేయడంతో మంటలు వ్యాపించి సజీవ దహనమయ్యాడు. మృతుడు మన్మీత్ అలీషర్ బ్రిస్బేన్లోని పంజాబీ జాతీయుల్లో పేరుగాంచిన సింగర్ కావడం గమనార్హం. అకస్మాత్తుగా, అనూహ్య రీతిలో జరిగిన ఈ ఘటనతో బస్సులో మంటలు వ్యాపించాయి.
వాషింగ్టన్, అక్టోబర్ 27:అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీ బాట పడుతున్నారా? 2014 లోక్సభ ఎన్నికల్లో మోదీకి ఘన విజయం చేకూర్చిన ‘అబ్కి బార్..మోదీ సర్కార్’ నినాదమే ఇప్పుడు ట్రంప్కు ఇండో ఆమెరికన్ల ఓట్లకు ఏరగా మారింది! ‘అబ్కి బార్, ట్రంప్ సర్కార్’ అంటూ ఇండో అమెరికన్లను ఆయన ఆకర్షిస్తున్నారు.
సిరియాలో అంతర్యుద్ధం పసివాళ్ల పాలిటి శాపంగా మారింది. సంకీర్ణ దళాల వైమానిక దాడులకు అభం శుభం తెలియని చిన్నారులు మృత్యువాత పడ్డారు. అలెప్పో సమీపంలోని ఓ పాఠశాలపై సైన్యం బాంబులతో దాడి చేసింది. ఈ దాడిలో 20మంది విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు.
అలెప్పో, అక్టోబర్ 27: సిరియాలో కొనసాగుతున్న యుద్ధంలో తాజాగా అమాయకులైన పిల్లలు అమానుషంగా హతమయ్యారు. నైరుతి సిరియాలోని ఓ పాఠశాలపై జరిగిన వైమానిక దాడిలో 26మంది మరణించగా అందులో కనీసం 20మంది అభంశుభం తెలియని పిల్లలే ఉండటం గమనార్హం. తిరుగుబాటుదారుల చేతుల్లో ఉన్న ఇడ్లిబ్ ప్రావిన్స్లోని ఓ పాఠశాలపై బుధవారం జరిగిన వైమానిక దాడుల్లో కనీసం 26మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు.
ఇస్లామాబాద్, అక్టోబర్ 27: దేశ రాజధాని ఇస్లామాబాద్లో రెండు నెలల పాటు ర్యాలీలు, సభల నిర్వహణపై నిషేధం విధిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. నవాజ్ షరీఫ్ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నాయకుడు ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్లో నవంబర్ 2న ఆందోళన చేయడానికి ప్రణాళిక రూపొందించుకున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిషేధాజ్ఞలు విధించింది.
వాషింగ్టన్, అక్టోబర్ 26: తమ గడ్డపై ఉన్న ఉగ్రవాద స్థావరాలపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్పై అమెరికా ఒత్తిడి పెంచుతోంది. ‘పొరుగుదేశాలపై దాడులు చేయాలనుకంటున్న తమ సొంతగడ్డపై ఉన్న ఉగ్రవాద ముఠాలపై చర్యలు తీసుకోవడం ద్వారా పాకిస్తాన్ ప్రాంతీయ సుస్థిరతకు నేరుగా దోహదపడగలదని మేము భావిస్తున్నాం’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి జాన్ కిర్బీ మంగళవారం విలేఖరులతో అన్నారు.
యాష్బర్న్, అక్టోబర్ 26: అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలు సమీపిస్తుండటంతో భారతీయ అమెరికన్లను ఆకట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం పుణ్యమా అని అమెరికాలో దీపావళి పండుగ ముందుగానే వచ్చేసింది. భారతీయ సంతతి అధికంగా నివసించే వర్జీనియాలోని ఓ హిందూ ఆలయంలో జరిగిన దీపావళి వేడుకకు డొనాల్డ్ ట్రంప్ కోడలు లారా ట్రంప్ హాజరయ్యారు.