S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/05/2016 - 12:00

తిరుమల:ఇకపై 90 రోజులు ముందుగానే శ్రీవారి సేవా టికెట్లను అందజేయనున్నట్లు, ఆన్‌లైన్‌లో సేవా టికెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు శుక్రవారం ఉదయం తెలిపారు. నమూనా ఆలయంలో ఉదయం7 నుంచి 9వరకు భక్తులకు అనుమతి ఇస్తున్నామన్నారు. రాగి డాలర్లను నమూనా ఆలయం వద్ద విక్రయిస్తామని చెప్పారు. 40కోట్లతో బర్డ్‌ ఆస్పత్రిని అభివృద్ధి చేయనున్నట్లు ఈవో ప్రకటించారు.

08/05/2016 - 11:49

ముంబై : శుక్రవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 66.86 పైసలుగా ఉంది. సెన్సెక్స్‌ 220 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా, నిఫ్టీ 60 పాయింట్ల లాభంలో ట్రేడవుతోంది.

08/05/2016 - 11:49

ఖమ్మం: మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు శుక్రవారం ఉదయం గుండెపోటుతో కొత్తగూడెంలో కన్నుమూశారు. కోనేరు మృతి పట్ల మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ నామా, ఎమ్మెల్యే సండ్ర, టీడీపీ నేత తుళ్లూరి భద్రయ్య సంతాపం తెలిపారు.

08/05/2016 - 06:50

గుంటూరు, ఆగస్టు 4: కృష్ణా పుష్కరాలలో భక్తులకు స్వచ్ఛంద సంస్థలు సేవలందించాలని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఓపెన్ ఫోరం నిర్వహించారు. పుష్కర ఏర్పాట్లపై కలెక్టర్ కాంతిలాల్ దండే పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు.

08/05/2016 - 06:50

గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 4: ప్రత్యేక హోదాపై కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు నాటకాలాడుతున్నాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు పేర్కొన్నారు.

08/05/2016 - 06:49

తుళ్లూరు, ఆగస్టు 4: పార్టీ జెండా మోసిన తాము ప్రతిపక్షమా, అధికారపక్షమా చెప్పమంటూ తెలుగు తమ్ముళ్లు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఎదుట గళమెత్తారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా స్థానిక గంటలమ్మ చెరువుకట్టపై చినరాజప్ప మొక్కలు నాటే కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. తొలుత పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు పుష్పాంజలి సమర్పించారు.

08/05/2016 - 06:49

గుంటూరు (కార్పొరేషన్), ఆగస్టు 4: కృష్ణా పుష్కరాలు వచ్చే యాత్రికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాట్లు చేయాలని పుష్కరాల ప్రత్యేకాధికారి రాజశేఖర్ తెలిపారు. గురువారం గోరంట్లలోని హోసన్న మందిరం వద్ద జరుగుతున్న పుష్కర్‌నగర్ నిర్మాణ పనులను కలెక్టర్ కాంతిలాల్‌దండే, నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మిలతో కలిసి ఆయన తనిఖీలు నిర్వహించారు.

08/05/2016 - 06:48

గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 4: కృష్ణా పుష్కరాలకు ఆర్టీసీలోని వివిధ యూనియన్లు, సిబ్బంది సహాయ సహకారాలు అందించాలని రీజనల్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి పేర్కొన్నారు. గురువారం ఎన్‌టిఆర్ బస్‌స్టేషన్ తిక్కన కాన్ఫరెన్స్ హాలులో రీజియన్‌లోని అన్ని యూనియన్ల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి వచ్చే సిబ్బందికి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.

08/05/2016 - 06:48

అమరావతి, ఆగస్టు 4: అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఎటువంటి అనుమతులు లేకుండా స్థానిక మ్యూజియం సెంటర్‌లో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ విగ్రహం ఏర్పాటు వివాదాస్పదంగా మారింది. ఎట్టకేలకు జిల్లా అధికార యంత్రాంగం సూచన మేరకు బుధవారం రాత్రి పొద్దుపోయాక రాత్రికి రాత్రే ఎన్‌టిఆర్ విగ్రహాన్ని తొలగించారు.

08/05/2016 - 06:48

అచ్చంపేట, ఆగస్టు 4: స్ర్తి అక్షరాస్యతతోనే సమాజాభివృద్ధి జరుగుతుందని మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఎస్ వెంకయ్య అన్నారు. కస్తూరిబా బాలికల ఆశ్రమ పాఠశాల లో గురువారం జరిగిన ఎస్‌ఎంసి మొ దటి సమావేశానికి ఆయన జెడ్పీటీసీ ఎన్ వెంకటేశ్వరరావు, పివి రామారావు, ఆర్ విశే్వశ్వరరావు, ఆశీర్వాదంతో కలిసి ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. సమావేశానికి ఎస్‌ఎంసి చైర్మన్ యెనిగండ్ల విజయలక్ష్మి అధ్యక్షత వహించారు.

Pages