S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/05/2016 - 06:47

మంగళగిరి, ఆగస్టు 4: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లు ఓటింగ్ జరిగితే తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీలు సహకరించి ఆమోదింప జేయాలని వైఎస్‌ఆర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ జలీల్ గురువారం ఒక ప్రకటనలో కోరారు.

08/05/2016 - 06:47

అచ్చంపేట, ఆగస్టు 8: ప్రభుత్వ అమనుమతులు లేకుండా ఆస్తులను ధ్వంసం చేస్తూ విగ్రహాలను పెట్టేవారిపై, అందుకు సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పెదకూరపాడు నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కావటి మనోహర్ నాయుడు డిమాండ్ చేశారు. గురువారం ఆయన గడప గడపకు వైసిపి కార్యక్రమంలో భాగంగా నీలేశ్వరపాలెం గ్రామంలో పర్యటించారు. మొదటగా స్థానికంగా విలేఖర్లతో మాట్లాడారు.

08/05/2016 - 06:46

గుంటూరు (కార్పొరేషన్), ఆగస్టు 4: గుంటూరు నగర ప్రజలకు శుద్ధిచేసిన సురక్షితమై మంచినీటిని అందించేందుకు అధికారులు కృషి చేయాలని మంచినీటి సరఫరా వ్యవస్థను ప్రత్యేక పర్యవేక్షణ చేసేందుకు నియమించిన టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులు తెలిపారు.

08/05/2016 - 06:46

మంగళగిరి, ఆగస్టు 4: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం పట్టణణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ గాలిగోపురం ఎదుట గల మహాత్మాగాంధీ విగ్రహం వరకు సాగింది. గాంధీకి వినతిపత్రం అందజేశారు.

08/05/2016 - 06:45

తెనాలి రూరల్, ఆగస్టు 4: స్థానిక జయప్రకాష్‌నగర్‌కు చెందిన వేముల లక్ష్మీదుర్గ(30)ను ఆమె భర్త వెంకటకృష్ణ గురువారం సాయంత్రం సమయంలో రోకలి బండతో తలపై మోది హతమార్చాడు. పోలీసుల కథనం ప్రకారం వెంకటకృష్ణ లక్ష్మీదుర్గకు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి 7 సంవత్సరాల బాబు, 5 సంవత్సరాల కుమార్తె ఉన్నారు.

08/05/2016 - 06:44

భద్రాచలం, ఆగస్టు 4: మన్యాన్ని ముసురు వీడటం లేదు. గత నాలుగు రోజులుగా ఆకాశానికి చిల్లు పడ్డట్లుగా ఒకటే వాన. కుండపోతతో జనజీవనం అస్తవ్యస్తంగా మారి స్తంభించింది. వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల్లోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు, చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. పాలెం, తాలిపేరు ప్రాజెక్టుల్లోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది.

08/05/2016 - 06:43

ఖానాపురం హవేలి, ఆగస్టు 4: ఖమ్మం సర్వే ల్యాండ్ రికార్డ్సులో పని చేస్తున్న మురళీ అనే సర్వేయర్ ఏసిబికి చిక్కారు. బోనకల్ మండలం కలకోట గ్రామానికి చెందిన కానూరి గోపీకృష్ణ అనే రైతు తన భూమిని రీ సర్వే చేయాలని మండల రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు.

08/05/2016 - 06:42

ఖమ్మం, ఆగస్టు 4: అటవీ భూమిలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులపై దాడులు చేస్తున్నారని, పంటను నాశనం చేస్తున్నారని ఆరోపిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. హరితహారం పేరుతో పేదల పొట్టలు కొడుతున్నారంటూ సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసి, సిపిఐ, సిపిఎంలు క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆందోళనలు చేస్తున్నాయి. ఇది గత కొనే్నళ్ళుగా జరుగుతూనే ఉంది.

08/05/2016 - 23:50

నందికొట్కూరు, ఆగస్టు 4 : కరవు కాటకాలకు నిలయమైన, తాగు, సాగునీరు అందక సతమతమవుతున్న రాయలసీమకు వరప్రదాయినిగా భావిస్తున్న హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను నేటి నుంచి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కృష్ణానది ఎగువ ప్రాంతమైన మహారాష్టల్రో భారీ వర్షాలు కురవడంతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు పూర్తిగా నిండడంతో వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టు వైపు పరుగులు తీస్తుంది.

08/05/2016 - 06:40

నంద్యాల, ఆగస్టు 4: నంద్యాల పట్టణ శివారులో కుందూనది ఒడ్డున రైల్వే శాఖకు చెందిన 22 ఎకరాల రైల్వే స్థలం కబ్జాదారుల చేతిలో ఆక్రమణకు గురైనా రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదు. రైల్వే స్థలంలో బడా బాబులు తిష్టవేసి దర్జాగా వరి సాగు చేసుకుంటున్నారు.

Pages