ఎమర్జెన్సీపై విస్తృత చర్చ జరపాలి
Published Monday, 26 June 2017కరీంనగర్ టౌన్, జూన్ 26: నాలుగు దశాబ్దాల క్రితం దేశంలో నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీపై విస్తృత చర్చ జరుపుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలకు దీనిపై అవగాహన కల్పించాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. ఆపార్టీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని ఫిల్మ్భవన్లో ఎమర్జెన్సీ వ్యతిరేక నిరసన దినం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, నాటి కాంగ్రెస్ హాయాంలోతప్పుడు విధానాలతోఅధికారం చేపట్టిన ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని రద్దు చేసే దిశగా ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతోభయపడి, ఎమర్జెన్సీ విధించందని అన్నారు.