అనంతపురం

కర్ణాటక గవర్నర్ నేడు పుట్టపర్తి రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, ఆగస్టు 29:కర్ణాటక రాష్ట్ర గవర్నర్ బిజూభాయ్‌వాలా నేడు పుట్టపర్తికి రానున్నట్లు తహశీల్దార్ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఉదయం 8:40గంటలకు సత్యసాయి విమానాశ్రయానికి ప్రత్యేక హెలీకాప్టర్‌లో చేరుకుంటారన్నారు. సత్యసాయి విమానాశ్రయంలో హెలీకాప్టర్‌కు ఇంధనం వేయించుకుని ఇక్కడి నుండి 9:00గంటలకు శ్రీశైలం బయలుదేరి వెళతారు. అక్కడ భ్రమరాంబ, మల్లికార్జున స్వామిలను దర్శించుకుని అక్కడి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:40గంటలకు తిరిగి పుట్టపర్తి చేరుకుంటారు. ఇక్కడి నుండి 2గంటలకు బయలుదేరి బెంగుళూరు వెళ్తారన్నారు.