అనంతపురం

హోదాతోనే అభివృద్ధి జరగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుకొండ, సెప్టెంబర్ 19:ఒక్క ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందబోదని ఎమ్మెల్యే బికె పార్థసారథి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహ ఆవరణలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు అంతంత మాత్రంగానే అభివృద్ధి చెందడం చూస్తున్నామన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలు ప్రత్యేక హోదాపై రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. కరవు నివారణ కింద రాయలసీమ జిల్లాలకు రూ.1100 కోట్లు నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. కరవు నిధుల్లో రూ.250 కోట్లతో నియోజకవర్గంలోని పలు మండలాలకు తాగునీరు అందించడం జరుగుతుందన్నారు. టిడిపి చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు నడుంబిగించాలన్నారు. సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.