అనంతపురం

పాకిస్తాన్‌పై యుద్దం ప్రకిటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడిపత్రి, సెప్టెంబర్ 19: భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తక్షణం పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించాలని, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను వెంటనే ధ్వంసం చేయాలని విశ్వహిందూ పరిషత్ రాయలసీమ విభాగ్ అధ్యక్షులు రాధాకృష్ణ డిమాండ్ చేశారు. యూరి ఆర్మీ బేస్‌పై ఉగ్రవాదుల దాడిలో అమరులైన 17మంది జవానుల ఆత్మలకు శాంతి చేకూరాలని సోమవారం చల్లా సర్కిల్‌లో విహెచ్‌పి ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించి, పాకిస్తాన్ జాతీయ జెండాను దహనం చేశారు. అనంతరం వడ్లపాలెంలోని అంకాలమ్మ ఆలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో రాధాకృష్ణ మాట్లాడుతూ భారత్‌లోని పాకిస్తాన్ రాయభార కార్యాలయాన్ని మూసివేయాలని, పాకిస్తాన్ హై కమిషనర్‌ను వెనక్కు పంపాలని, పాక్‌తో వాణిజ్య కార్యకలాపాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశానికి స్వాతం త్య్రం వచ్చి 69 సంవత్సరాలైనా పాకిస్తాన్ దుర్బుద్ధిని మనం గ్రహించకపోవడం దారుణమన్నారు. అనేక దశాబ్దాలుగా యుపిఏ ప్రభుత్వం ఓటుబ్యాంకు రాజకీయాలు చేసిందని, పాకిస్తాన్‌పై దాడులు చేస్తే ముస్లీంలు కాంగ్రెస్‌కు ఓటు వేయరనే భావనతోనే, కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ ఆటలను కొనసాగినిచ్చిందని ఆరోపించారు. 2014లో హిందూ, ముస్లీం, క్రిస్టియన్ల మద్దతుతో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారని, ఇంతటి గట్టిమద్దతుతో గెలిచిన ప్రధాని మోదీ కూడా పాకిస్తాన్ అరాచక శక్తుల ఆటలను ఎందుకు సాగనిస్తున్నారో అర్థంకావడం లేదన్నారు. ప్రతి దేశ భక్తుడు పాకిస్తాన్‌పై యుద్ధం చేయాలని బిజేపి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. అనంతపురం పార్లమెంటు సభ్యులు జెసి దివాకర్‌రెడ్డి అఖండ భారత్‌ను సాధించాలని, పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించాలని ఎంపి చెప్పడం దేశానికే గర్వకారణమని, ఈ విషయాన్ని విహెచ్‌పి తరపున స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజేపి సీనియర్ నాయకులు శ్రీరంగయ్య, లక్ష్మినారాయణ, విహెచ్‌పి పట్టణ కార్యదర్శి రాజశేఖరరెడ్డి పాల్గొన్నారు.