అనంతపురం

చెరువులో పడి వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోమందేపల్లి, డిసెంబర్ 2 : మండలంలోని పాపిరెడ్డిపల్లి చెరువులో వ్యక్తి శవమై తేలిన ఘటన శుక్రవారం జరిగింది. సోమందేపల్లికి చెందిన దూదేకుల ఇమాంసాబ్ (45) కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా కుటుంబానికి దూరంగా ఉండేవాడు. ఈనేపథ్యంలో వారం రోజుల క్రితం గ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులకు కనబడి తిరిగి అదృశ్యమయ్యాడు. అయితే సోమందేపల్లి సమీపంలో ఉన్న పాపిరెడ్డిపల్లి చెరువులో శవమై తేలాడుతుండగా పశువుల కాపర్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు చెరువు వద్దకు వెళ్లి పరిశీలించగా మృతుడి దుస్తులు, చెప్పులు గట్టుపై లభ్యమయ్యాయి. మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు ఇమాంసాబ్‌గా గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, ముగ్గురు సంతానం ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
యువకుడి ఆత్మహత్య
అనంతపురం అర్బన్, డిసెంబర్ 2:నగరంలోని నవోదయ కాలనీకి చెందిన లక్ష్మణ్‌రావ్ (22) శుక్రవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ వెంకటరమణ తెలిపారు. యువకుడు మటన్ మార్కెట్‌లో పనిచేస్తుండేవాడని, గత కొంత కాలంగా అప్పులు చేసినట్లు కుటంబ సభ్యుల ద్వారా తెలిసిందన్నారు. యువకుడి మృతిపై కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకట్రమణ తెలిపారు. శవాన్ని పోస్టుమార్టమ్ కోసం సర్వజన ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
మహిళ ఆత్మహత్య
అనంతపురం అర్బన్, డిసెంబర్ 2:అనంతపురం రూరల్ మండలంలోని పాపంపల్లిలో శుక్రవార నాగజ్యోతి (30) అనే వివాహిత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తమకు ఫిర్యాదు అందిందని టుటౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. దీనిపై కేసునమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్. ఐ తెలిపారు.