అనంతపురం

గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డి.హీరేహాల్, మే 13 : మండల పరిధిలోని మడమేహళ్లి గేటు ఎదురుగా ఉన్న నర్సరీలో 65 సంవత్సరాల వయసు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ శేఖర్ తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో నర్సరీలో మొక్కలకు నీళ్లు పెడుతున్న పని మనిషి చెట్టుకు ఉరేసుకుని కుని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని చూసి సమాచారాన్ని పోలీసులకు అందించాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శేఖర్, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని కిందకు దించారు. చనిపోయిన వ్యక్తి కర్నాటక వాసుడై ఉంటాడని ఎస్‌ఐ తెలిపారు. వ్యక్తికి సంబంధించిన ఫొటోను సమీప ప్రాంతంలో ఉన్న కర్నాటక పోలీసు స్టేషన్లకు సమాచారం అందించామని ఎస్సై తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.