అనంతపురం

వైభవంగా ధ్వజారోహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరవకొండ, మే19:జిల్లాలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం పెన్నహోబిళం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగం గా గురువారం ధ్వజారోహణం వైభవంగా జరిగింది. ఆ లయంలో సుప్రభాత సేవలో భాగంగా స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, అర్చనలు, ప్రత్యేక పూజ లు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భూదేవి, శ్రీదేవి సమేతుడైన నరసింహస్వామి ఉత్సవ విగ్రహాలను పట్టు వస్త్రాలతో, వివిధ పుష్పాలతో అలంకరించి స్వామి వారిని పల్లకిలో కొలవుదీర్చి ఆలయ ప్రాంగణంలో భాజాభజంత్రీల నడుమ ఊరేగించారు. అనంతరం ధ్వజారోహణం వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆలయ ఇఓ రమేష్‌బాబు, ప్రధాన అర్చకులు ద్వారకనాథచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.