అనంతపురం

అంజన్నకు తులసీ లక్షదళార్చన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, మే 27 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం దక్షిణాది హనుమజ్జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అంజన్నకు తులసీ లక్షదళార్చన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని మూలవిరాట్ ఆంజనేయస్వామికి తెల్లవారుజామున సుప్రభాత సేవ, మహాభిషేకం, వజ్రకవచాలంకరణ, బంగారు కిరీటధారణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహానివేదన, మహా మంగళ హారతి నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఆలయ అర్చకులు, వేదపండితులు, భక్తుల ఆధ్వర్యంలో స్వామివారి విగ్రహానికి పూలంగి సేవ నిర్వహించారు. సాయంకాలం తులసీ లక్షదళార్చన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులతో పాటు ఇఓ ముత్యాలరావు, ఎఇఓ ధనుంజయ, ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త కుటుంబ సభ్యురాలు సుగుణమ్మ, భక్తులు పాల్గొన్నారు.