అనంతపురం

వివాహిత అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి టౌన్, జూన్ 17: కదిరి మండలం దినె్నమీదపల్లికి చెందిన గౌరమ్మ(19) శుక్రవారం సాయంత్రం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. కుటుంబసభ్యులు, బంధువుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని బాబాకాలనీకి చెందిన గౌరమ్మను దినె్నమీదపల్లికి చెందిన రామాంజినేయులుకు ఇచ్చి ఏడాది క్రితం పెళ్లి చేశారు. శుక్రవారం సాయంత్రం రామాంజినేయులు ఫోన్ చేసి కూతురు ఆరోగ్యం సరిగా లేకోపవడంతో నల్లమాడలోని ఓ ఆర్‌ఎంపి డాక్టర్‌కు చూపించామని పరిస్థితి విషమించడంతో కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందిందని చెప్పినట్లు గౌరమ్మ తల్లిదండ్రులు తెలిపారు. తాము కదిరికి చేరుకునేలోగానే మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తుండగా అడ్డుకున్నామన్నారు. మృతదేహాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించి అల్లుడిపై ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.