అనంతపురం

రోడ్డుప్రమాదంలో ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుక్కరాయసముద్రం, జూలై 4: అనంతపురం-తాడపత్రి రహదారిలో బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామ సమీపాన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కౌలు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొర్రపాడు గ్రామానికి చెందిన రాధాకృష్ణ(45), వడ్డే పెద్దన్న(46)లు మృత్యువాతపడ్డారు. పోలీసులు, కుటుంబ సభ్యులు అందించిన వివరాల మేరకు వడ్డే పెద్దన్న, రాధాకృష్ణ ద్విచక్ర వాహనంలో కౌలుకు తీసుకున్న పొలం వద్దకు బయలుదేరారు. రోడ్డుకు పక్కనే ఉన్న వేరొక పొలంలో వ్యవసాయం చేస్తున్న ట్రాక్టర్‌ను వ్యవసాయ పనుల కోసం పిలిచి రోడ్డు అవతల నుండి వారి పొలం వైపుకు దాటుకుంటున్న సమయంలో తాడిపత్రి వైపు నుండి అనంతపురం వైపు వెళ్తున్న కారు ఢీకొనడంతో వారిద్దరూ మృత్యువాతపడ్డారని అన్నారు. విషయం తెలిసిన వెంటనే బుక్కరాయసముద్రం ఎస్సై విశ్వనాథచౌదరి తన సిబ్బందితో సంఘటనా స్థలంకు చేరుకొని పరిస్థితిని సమీక్షించి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇటుకలపల్లి సిఐ రాజేంద్రనాథ్‌యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి మృతదేహాలను శవపంచనామా నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ పరారీ అయ్యాడని, కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న మండల తహశీల్దార్ రామకృష్ణయ్య బాధితుల కుటుంబాలను పరామర్శించారు.