అనంతపురం

14న ముఖ్యమంత్రి చంద్రబాబు రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూలై 19 : పంద్రాగస్టు వేడుకలు అనంతలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకరోజు ముందుగానే ఈనెల 14న జిల్లాకు రానున్నారు. ఆరోజు ఉదయమే అనంతపురం చేరుకుంటారని అధికారులకు సూచన ప్రాయంగా సమాచారం అందింది. ఈ సందర్భంగా జిల్లాలో జరిగే వివిధ అభివృద్ధి పనులపై సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హంద్రీనీవా, హెచ్చెల్సీ ఆధునీకరణ, నీరు-చెట్లు, మైనర్ ఇరిగేషన్, వ్యవసాయంపై సమీక్ష ఉండవచ్చని అనుకుంటున్నారు. అలాగే పార్టీ నేతలతో సమావేశం ఉండవచ్చని భావిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్ష జరుపుతారన్న ఉద్దేశంతో అధికారులు ముందుస్తుగా ఆయా శాఖల ప్రగతిపై సిద్ధంగా ఉండాలని జిల్లా ఉన్నతాధికారులు సూచించినట్లు తెలుస్తోంది. 15వ తేదీ జెండా ఆవిష్కరణ, ప్రసంగం అనంతరం సిఎం విజయవాడకు వేళ్తారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసేందుకు జిల్లాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.