అనంతపురం

మంత్రి అచ్చెన్నాయుడితో బాలయ్య భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, ఆగస్టు 4 : కార్మిక, క్రీడల శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని గురువారం ఎపి సచివాలయంలో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధి, వివిధ పథకాల కింద చేపట్టే పనులకు నిధులు మంజూరు చేయాలనే తదితర అంశాలపై మంత్రితో చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హిందూపురం పట్టణంలోని ఎంజిఎం క్రీడా మైదానంలో ఇండోర్, ఔట్‌డోర్ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం రూ.17 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి కనుమూరి శేఖర్ తెలిపారు. తొలి విడతగా స్టేడియంల నిర్మాణానికి రూ.6 కోట్లు మంజూరు చేశారని, ఇందుకు సంబంధించి ఈ నెల 19వ తేదీన భూమిపూజ చేయనున్నట్లు చెప్పారు. స్టేడియంల నిర్మాణానికి సర్వే, ప్లాన్ తదితర వాటి వివరాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. రెండో విడత కింద మరో రూ.11 కోట్ల నిధులు విడుదల అవుతాయన్నారు. ఈ భేటీలో క్రీడల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేఖరాణి కూడా పాల్గొన్నారు.