అనంతపురం

ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఆగస్టు 4 : ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలు విజవయంతం చేయాలని కలెక్టర్ కోన శశిధర్ కోరారు. ఈమేరకు గురువారం ఎస్పీ రాజశేఖరబాబు, జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతంతో కలిసి బుక్కరాయసముద్రం, ధర్మవరంలో ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. తొలుత ధర్మవరం సమీపంలోని కుణుతూరు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్, ఫారంపాండ్స్ పనులతో పాటు ఎన్‌టిఆర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి, ధర్మవరంలోని జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న ప్రాంతంలో మొక్కలు నాటే ప్రదేశం, బహిరంగ సభ ఏర్పాట్లు, ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు ధర్మవరంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులకు కేటాయించిన విధులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఎస్పీని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ, జిల్లా పరిషత్ సిఇఒ రామచంద్ర, ఆర్‌డిఓ బాలానాయక్, సంబంధిత అధికారులు, ఇతర శాఖల అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. అక్కడి నుంచి నేరుగా బుక్కరాయసముద్రానికి చేరుకుని కాశీ విశే్వశ్వర ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ స్థలాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి మండల కేంద్రంలో సిఎం ప్రారంభించనున్న ఆధునాతన హంగులతో నిర్మించిన పంచాయతీ భవానాన్ని తనిఖీ చేశారు. తర్వాత కెజిబివి సమీపంలో జరగనున్న బహిరంగ సభ ప్రదేశాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్, జెసి-2 సయ్యద్ ఖాజామొహిద్దీన్, డిఆర్‌డిఏ పిడి వెంకటేశ్వర్లు, సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు.